Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో తగ్గిన మద్యం ధరలు - బీరు బాటిల్‌పై రూ.30 తగ్గింపు

Webdunia
ఆదివారం, 19 డిశెంబరు 2021 (18:26 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ధరలు భారీగా తగ్గాయి. ఒక్కో బీరు బాటిల్‌పై రూ.30 మేరకు తగ్గింది. అలాగే, ఇతర బ్రాండ్లపై కూడా ధరలు బాగానే తగ్గాయి. ఈ తగ్గిన ధరలు ఆదివారం నుంచే అమల్లోకి వచ్చాయి. 
 
మద్యం బ్రాండ్లపై ప్రభుత్వం వసూలు చేస్తున్న వ్యాట్, అదనపు ఎక్సైజ్ డ్యూటీ, స్పెషల్ మార్జిన్‌ వంటి పన్నుల్లో హేతుబద్ధత తీసుకొస్తూ శనివారం రెవెన్యూ శాఖ ప్రత్యేక అదనపు కార్యదర్శి రజత్ భార్గవ్ ఆదేశాలు జారీచేశారు. దీంతో ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్‌పై 5 నుంచి 12 శాతం, ఇతర అన్ని కేటగిరీల మద్యంపై 20 శాతం మేరకు ధరలు తగ్గనున్నాయి. బీర్లపై 10 నుంచి 20 శాతం తగ్గనుంది. 
 
స్పెషల్ మార్జిన్ 36 శాతం, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ 36 శాతం తగ్గించారు. మొత్తంగా చూసుకుంటే బీర్లపై 20 నుంచి 30 రూపాయల వరకు ధరలు తగ్గనున్నాయి. అలాగే వచ్చే వారంలో అన్ని రకాల విదేశీ బ్రాండ్లను మద్యం షాపుల్లో విక్రయానికి అందుబాటులో ఉంచనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments