Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం - ఆ జట్టు రద్దు.. గవర్నర్ ఆమోదం

ఠాగూర్
శుక్రవారం, 6 డిశెంబరు 2024 (09:22 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం జ్యూడిషియల్ ప్రివ్యూ చట్టాన్ని రద్దు చేసింది. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీచేశారు. టెండర్ల విధానంలో పారదర్శకత ఉండాలంటూ గత వైకాపా ప్రభుత్వం 2019లో ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (జ్యూడీషియల్ ప్రియూ పారదర్శక) చట్టాన్ని తీసుకొచ్చింది. హైకోర్టు రిటైర్డ్ జడ్జిని జ్యూడీషియల్ ప్రియూ న్యాయమూర్తిగా నియమించింది. 
 
రూ.వంద కోట్లు అంతకంటే ఎక్కువ వ్యయం ఉన్న టెండర్ ముసాయిదా షెడ్యూల్‌ను ముందుగా జ్యూడీషియల్ ప్రివ్యూ న్యాయమూర్తి పరిశీలించాలని నాడు జగన్మోహన్ రెడ్డి సర్కారు నిర్ణయించింది. అయితే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జ్యూడీషియల్ ప్రివ్యూతో ఎలాంటి ప్రయోజనం లేదని రాష్ట్ర కేబినెట్ ఓ అభిప్రాయానికి వచ్చి ఈ చట్టాన్ని రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం టెండర్ల జారీలో కేంద్ర మార్గదర్శకాలు, విజిలెన్స్ కమిషన్ నిబంధనలు తు.చ తప్పకుండా పాటిస్తుండటంతో ఈ చట్టాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు చేసిన ప్రతిపాదనలకు గవర్నర్ నజీర్ ఆమోదముద్ర వేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్ రికార్డ్

ఎంట‌ర్‌టైనర్ ప్రేమకథగా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ టీజ‌ర్‌, ఆవిష్కరించిన మెహ‌ర్ ర‌మేష్

డెంగీ జ్వరంతో బాధపడుతున్న సినీ నటి రాధిక

Kalpika Ganesh: నటి కల్పిక మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది.. మందులు వాడట్లేదు: తండ్రి గణేష్ ఫిర్యాదు (video)

OG: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి ఫస్ట్ బ్లాస్ట్ ఇవ్వబోతున్న థమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

తర్వాతి కథనం
Show comments