Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం - ఆ జట్టు రద్దు.. గవర్నర్ ఆమోదం

ఠాగూర్
శుక్రవారం, 6 డిశెంబరు 2024 (09:22 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం జ్యూడిషియల్ ప్రివ్యూ చట్టాన్ని రద్దు చేసింది. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీచేశారు. టెండర్ల విధానంలో పారదర్శకత ఉండాలంటూ గత వైకాపా ప్రభుత్వం 2019లో ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (జ్యూడీషియల్ ప్రియూ పారదర్శక) చట్టాన్ని తీసుకొచ్చింది. హైకోర్టు రిటైర్డ్ జడ్జిని జ్యూడీషియల్ ప్రియూ న్యాయమూర్తిగా నియమించింది. 
 
రూ.వంద కోట్లు అంతకంటే ఎక్కువ వ్యయం ఉన్న టెండర్ ముసాయిదా షెడ్యూల్‌ను ముందుగా జ్యూడీషియల్ ప్రివ్యూ న్యాయమూర్తి పరిశీలించాలని నాడు జగన్మోహన్ రెడ్డి సర్కారు నిర్ణయించింది. అయితే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జ్యూడీషియల్ ప్రివ్యూతో ఎలాంటి ప్రయోజనం లేదని రాష్ట్ర కేబినెట్ ఓ అభిప్రాయానికి వచ్చి ఈ చట్టాన్ని రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం టెండర్ల జారీలో కేంద్ర మార్గదర్శకాలు, విజిలెన్స్ కమిషన్ నిబంధనలు తు.చ తప్పకుండా పాటిస్తుండటంతో ఈ చట్టాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు చేసిన ప్రతిపాదనలకు గవర్నర్ నజీర్ ఆమోదముద్ర వేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janhvi Kapoor : RC16 లో టెర్రిఫిక్ రోల్ చేస్తున్న జాన్వి కపూర్ !

ఉపవాసం దీక్ష తో మూకుత్తి అమ్మన్ 2 చిత్ర పూజకు హాజరైన నయనతార

మ్యారేజ్ అంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదని చెప్పే చిత్రం మిస్టర్ రెడ్డి

Divya Bharathi: యాక్షన్ సీన్స్ చేయడం కష్టం, ఇలాంటి సినిమా మళ్ళీ రాదు : దివ్యభారతి

Mahesh Babu: రేపటి నుంచి ఒరిస్సా లో రాజమౌళి, మహేశ్‌బాబు సినిమా షూటింగ్‌ - తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

Dry Fish: ఎండుచేపలు ఎవరు తినకూడదు.. మహిళలు తింటే అంత మేలా?

Dry Fruits: పెరుగులో డ్రై ఫ్రూట్స్ కలిపి పిల్లలకు ఇవ్వడం చేస్తే?

తర్వాతి కథనం
Show comments