Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం - ఆ జట్టు రద్దు.. గవర్నర్ ఆమోదం

ఠాగూర్
శుక్రవారం, 6 డిశెంబరు 2024 (09:22 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం జ్యూడిషియల్ ప్రివ్యూ చట్టాన్ని రద్దు చేసింది. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీచేశారు. టెండర్ల విధానంలో పారదర్శకత ఉండాలంటూ గత వైకాపా ప్రభుత్వం 2019లో ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (జ్యూడీషియల్ ప్రియూ పారదర్శక) చట్టాన్ని తీసుకొచ్చింది. హైకోర్టు రిటైర్డ్ జడ్జిని జ్యూడీషియల్ ప్రియూ న్యాయమూర్తిగా నియమించింది. 
 
రూ.వంద కోట్లు అంతకంటే ఎక్కువ వ్యయం ఉన్న టెండర్ ముసాయిదా షెడ్యూల్‌ను ముందుగా జ్యూడీషియల్ ప్రివ్యూ న్యాయమూర్తి పరిశీలించాలని నాడు జగన్మోహన్ రెడ్డి సర్కారు నిర్ణయించింది. అయితే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జ్యూడీషియల్ ప్రివ్యూతో ఎలాంటి ప్రయోజనం లేదని రాష్ట్ర కేబినెట్ ఓ అభిప్రాయానికి వచ్చి ఈ చట్టాన్ని రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం టెండర్ల జారీలో కేంద్ర మార్గదర్శకాలు, విజిలెన్స్ కమిషన్ నిబంధనలు తు.చ తప్పకుండా పాటిస్తుండటంతో ఈ చట్టాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు చేసిన ప్రతిపాదనలకు గవర్నర్ నజీర్ ఆమోదముద్ర వేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హార్డ్ డిస్క్ మాయం వెనుక ఎవరు ఉన్నారు?

Sandeep Vanga: అర్జున్ రెడ్డిలా మారిన సందీప్ రెడ్డి.. దీపికాపై ఫైర్.. ఇదేనా మీ ఫెమినిజం అంటూ ఫైర్

Kannappa: కన్నప్పకు కష్టాలు: కీలక సన్నివేశాల హార్డ్ డ్రైవ్ మిస్సింగ్.. కేసు నమోదు

Ramya: మైసూర్ శాండల్ సోప్ అంబాసిడర్‌గా తమన్నా- నో చెప్తూ సీన్‌లోకి వచ్చిన నటి రమ్య

Prabhas: ప్రభాస్‌కు ఇటలీలో భారీ విలువ చేసే విల్లా- అద్దెకు ఇచ్చాడు.. రూ.40లక్షల సంపాదన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

చింత చిగురు వచ్చేసింది, తింటే ఏమవుతుంది?

నా ప్రాణమా, నన్నల్లుకునే పున్నమి సౌందర్యమా

తర్వాతి కథనం
Show comments