Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమృత్ పథకం నిర్వహణలో ఏపీ ఫస్ట్... ఇదిగోండి సర్టిఫికేట్: తెలంగాణ వెనుకబడిపోయిందే?

అమరావతి: కేంద్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన అమృత్ పథకం అమలులో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. నగరాలలో మంచినీటి సరఫరా, మురుగునీరు, వరద నీరు పారుదల, పారిశుద్ధ్య కార్యక్రమాలు, చెత్త సేకరణ వంటి పనులు సమర్థవంతంగా నిర్వహించేందుకు

Webdunia
సోమవారం, 24 సెప్టెంబరు 2018 (15:51 IST)
అమరావతి: కేంద్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన అమృత్ పథకం అమలులో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. నగరాలలో మంచినీటి సరఫరా, మురుగునీరు, వరద నీరు పారుదల, పారిశుద్ధ్య కార్యక్రమాలు, చెత్త సేకరణ వంటి పనులు సమర్థవంతంగా నిర్వహించేందుకు 2015 జూన్ 25న కేంద్రం ఈ పథకం ప్రవేశపెట్టింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఈ పథకం అమలు తీరు ఆధారంగా కేంద్రం ర్యాంకులు ఇస్తోంది. 
 
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మొదటి మూడు సంవత్సరాలలో ఈ పథకం అమలును సమీక్షించి ఇచ్చిన ర్యాంకుల ఆధారంగా ఏపీ 65.24 శాతం మార్కులతో మొదటి స్థానం సాధించింది. 59.17 శాతం మార్కులతో ఒడిస్సా రెండవ స్థానంలో, 54.32 శాతం మార్కులతో మధ్యప్రదేశ్ మూడవ స్థానంలో, 52.39 శాతం మార్కులతో తెలంగాణ 4వ స్థానంలో నిలిచాయి. 
 
సోమవారం ఢిల్లీలో జరిగిన ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ జాతీయ సమావేశంలో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పూరీ ఏపీ పట్టణ పరిపాలన శాఖ, అమృత్ మిషన్ ఏపీ డైరెక్టర్ కె.కన్నబాబుకు అవార్డుని అందజేశారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments