Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగివున్న టిప్పర్‌‍ను ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు... నలుగురి దుర్మరణం

ఠాగూర్
శుక్రవారం, 17 జనవరి 2025 (08:24 IST)
ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డు పక్కన ఆగివున్న టిప్పర్ లారీని ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. మరో 13 మంది గాయపడ్డారు. ఈ ప్రధాని శుక్రవారం వేకువజామున జరిగింది. చిత్తూరు జిల్లా శివారు గంగాసాగరం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 
 
తిరుపతి నుంచి మదురైకు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నియంత్రణ కోల్పోవడంతో రోడ్డు పక్కన ఉన్న టిప్పర్ లారీని ఢీకొట్టింది. ఆ తర్వాత బస్సు 20 అడుగులు జారుకుంటా రోడ్డు నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలోని విద్యుత్ స్తంభాన్ని బస్సు ఢీకొట్టింది. దీంతో కరెంట్ స్తంభం బస్సులోకి చొచ్చుకునివచ్చింది. దీంతో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ ప్రమాదంలో మరో 16 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కలెక్టర్ ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

గోల్డ్ స్మగ్లింగ్ కేసు : కన్నడ నటి రన్యారావుకు జైలు

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

వినూత్నమైన కాన్సెప్ట్ తో బకాసుర రెస్టారెంట్‌ : దర్శకుడు ఎస్‌జే శివ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments