Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించాను.. ఆ వ్యక్తినే పెళ్లి చేసుకుంటానన్న యువతి.. పెట్రోల్ పోసి..?

Webdunia
బుధవారం, 16 జూన్ 2021 (13:03 IST)
ప్రేమించానని ఓ యువతి చెప్పడం.. ప్రేమించిన వ్యక్తినే వివాహం చేసుకుంటానని తెలపడం.. ఆ యువతి ప్రాణం తీసింది. ఓ యువకుడిని ప్రేమించానని అతన్నే పెండ్లి చేసుకుంటానని చెప్పిన ఆ యువతి పై ఆమె కుటుంబసభ్యులే పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటన ఘటన ఆంధ్రప్రదేశ్, కడప జిల్లా రాయచోటిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
వివరాల్లోకి వెళితే.. రాయచోటి యువతికి పెండ్లి చేసేందుకు ఆమె తల్లిదండ్రులు కొంతకాలంగా సంబంధాలు చూస్తున్నారు. అందుకు ఆ యువతి ఒప్పుకోలేదు. మంగళవారం మరోసారి పెండ్లి విషయమై కుటుంబ సభ్యులంతా ఆమెను బలవంతపెట్టారు. 
 
నిరాకరించిన ఆ యువతి తాను ప్రేమించిన యువకుడినే పెండ్లి చేసుకుంటానని చెప్పింది. దాంతో ఆమె తల్లి, తండ్రి, సోదరుడు యువతిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. యువతి కేకలు వేయడంతో ఆమె సోదరి, ఇరుగుపొరుగువారు వచ్చి మంటలను ఆర్పారు. గాయపడిన యువతిని కడప రిమ్స్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments