Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించాను.. ఆ వ్యక్తినే పెళ్లి చేసుకుంటానన్న యువతి.. పెట్రోల్ పోసి..?

Webdunia
బుధవారం, 16 జూన్ 2021 (13:03 IST)
ప్రేమించానని ఓ యువతి చెప్పడం.. ప్రేమించిన వ్యక్తినే వివాహం చేసుకుంటానని తెలపడం.. ఆ యువతి ప్రాణం తీసింది. ఓ యువకుడిని ప్రేమించానని అతన్నే పెండ్లి చేసుకుంటానని చెప్పిన ఆ యువతి పై ఆమె కుటుంబసభ్యులే పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటన ఘటన ఆంధ్రప్రదేశ్, కడప జిల్లా రాయచోటిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
వివరాల్లోకి వెళితే.. రాయచోటి యువతికి పెండ్లి చేసేందుకు ఆమె తల్లిదండ్రులు కొంతకాలంగా సంబంధాలు చూస్తున్నారు. అందుకు ఆ యువతి ఒప్పుకోలేదు. మంగళవారం మరోసారి పెండ్లి విషయమై కుటుంబ సభ్యులంతా ఆమెను బలవంతపెట్టారు. 
 
నిరాకరించిన ఆ యువతి తాను ప్రేమించిన యువకుడినే పెండ్లి చేసుకుంటానని చెప్పింది. దాంతో ఆమె తల్లి, తండ్రి, సోదరుడు యువతిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. యువతి కేకలు వేయడంతో ఆమె సోదరి, ఇరుగుపొరుగువారు వచ్చి మంటలను ఆర్పారు. గాయపడిన యువతిని కడప రిమ్స్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments