Webdunia - Bharat's app for daily news and videos

Install App

వింత వ్యాధి నుంచి బయటపడిన ఏలూరు ప్రజలు!

Webdunia
బుధవారం, 16 డిశెంబరు 2020 (10:54 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే కాదు.. అటు జాతీయ స్థాయిలో ఏలూరు పట్టణంలో వెలుగు చూసిన వింత వ్యాధి ప్రకంపనలు రేపింది. ఈ వ్యాధిబారినపడిన వందల మంది ఆస్పత్రి పాలయ్యారు. దీంతో ఏలూరు పట్టణ వాసులంతా ప్రాణభయంతో వణికిపోయారు. అయితే, ఈ వింత వ్యాధి దాదాపుగా మాయమైంది. గడచిన మూడు రోజులుగా ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. దీంతో ఈ వింత వ్యాధి నుంచి ఏలూరు బయటపడిందని ప్రకటించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
 
బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం జగన్, ఏలూరు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఇదేసమయంలో ఈ వ్యాధి సోకడానికిగల కారణాలపై ఉన్నతాధికారుల నివేదిక కూడా ప్రభుత్వానికి అందుతుంది. ఆపై వ్యాధి కారణాలను వివరించనున్న ప్రభుత్వం, ఏలూరు విముక్తమైందని ప్రకటిస్తుందని తెలుస్తోంది. 
 
కాగా, ఇటీవల వెస్ట్ గోదావరి జిల్లాలోని ఏలూరు పట్టణంలో కలుషిత నీరు తాగడం వల్లే ఈ వ్యాధి సంభవించిందని, రక్తంలో పరిమాణానికి మించి లోహాలు చేరడమే ప్రజలను అస్వస్థతకు గురిచేసినట్టు అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్‌కు చెందిన నిపుణులతో కూడిన వైద్య బృందం తేల్చిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

తెలుగు చిత్రాలపై నయనతారకు ఎందుకో అంత ఇష్టం??

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments