Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిగ్రీ విద్యార్థినిని గొంతు నులిమి హత్య చేసిన యువకుడు.. ఎక్కడ.. ఎందుకు..?

Webdunia
బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (22:36 IST)
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా నరసరావుపేటలో దారుణం జరిగింది. డిగ్రీ విద్యార్థిని తోటి విద్యార్థి గొంతు నులిమి పాశవికంగా హతమార్చాడు. వివరాల్లోకి వెళితే.. ముప్పాళ్ల మండలం గోళ్లపాడు గ్రామానికి చెందిన అనూష (19) నరసరావుపేటలోని ఓ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. 
 
బొల్లాపల్లి మండలం పమిడిపాడు చెందిన విష్ణువర్ధన్ రెడ్డి సైతం అదే కాలేజీలో చదువుతున్నాడు. వీరిద్దరూ కొద్దిరోజులుగా ప్రేమించుకుంటున్నట్లు సమాచారం. కొద్దిరోజులుగా యువతి మరో యువకుడితో చనువుగా ఉంటోందని విష్ణువర్ధన్‌ రెడ్డి అనుమానం పెంచుకున్నాడు. 
 
బుధవారం అనూషను మాట్లాడుకుందాం అని పిలిచి ఆమెతో గొడవకు దిగాడు. పాలపాడు రోడ్డు గోవిందపురం మేజర్ కాలువ వద్ద యువతిని గొంతు నులిమి దారుణంగా హత్య చేసి కాలువలోకి పడేశాడు. అనంతరం నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.  
 
నరసరావు పేటలో విద్యార్థిని హత్య ఘటనపై సీఎం జగన్‌ ఆరా తీస్తున్నారు. సీఎంవో అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని సీఎం జగన్‌ పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments