Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'పల్లె' ఫలితాలు తెచ్చిన జోరు.. ఆ ఎన్నికలకు సై అంటున్న సీఎం జగన్

'పల్లె' ఫలితాలు తెచ్చిన జోరు.. ఆ ఎన్నికలకు సై అంటున్న సీఎం జగన్
, మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (16:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో అధికార వైపాకా మెజార్టీ స్థానాలను దక్కించుకుంది. మొత్తం స్థానాల్లో 80 శాతానికి పైగా దక్కించుకుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఏపీ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఇందులో మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశంపై చర్చ జరిగింది. 
 
ముఖ్యంగా, గ్రామపంచాయతీ ఎన్నికల్లో అధికార వైకాపాకు సానుకూల ఫలితాలు రావడంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం జగన్‌ మంత్రులకు వివరించారు.
 
ఈ సందర్భంగా పంచాయతీ ఎన్నికల్లో భారీ విజయాలపై సీఎం మంత్రులను అభినందించారు. పంచాయతీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 80 శాతం ఫలితాలు సాధించామన్నారు. 
 
కోవిడ్ వ్యాక్సినేషన్ త్వరగా ఇవ్వకపోతే మళ్లీ కేసులు పెరిగే అవకాశం ఉంది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై  అసెంబ్లీలో తీర్మానం పెట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
 
అంతకుముందు సీఎం అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌, మంత్రులు కొడాలి నాని, ఆదిమూలపు సురేష్‌, బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాస్టర్స్‌ ఆఫ్‌ రిస్క్‌ ఇన్‌ అగ్రికల్చర్‌ అవార్డు గెలుచుకున్న కావేరీ సీడ్స్‌