Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజుకు సగటున రూ.205 కోట్లు అప్పు చేస్తున్న సీఎం జగన్ సర్కారు

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2023 (12:48 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకునిపోతుంది. ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తుంది. సగటున రోజుకు రూ.205 కోట్లు చొప్పున అప్పు చేస్తుంది. గత 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం చేసిన రుణం రూ.55 వేల కోట్లు దాటేసింది. ప్రభుత్వం చేస్తున్న అప్పులపై విపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నా సీఎం జగన్ మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
 
పైగా, సీఎం జగన్ సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం చేస్తున్న అప్పులు సరికొత్త రికార్డులు నెలకొల్పేలా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో గడిచిన 9 నెలల కాలంలో ప్రభుత్వం చేసిన అప్పు స్థూలంగా రూ.55,555 కోట్లకు చేరుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొదటి మూడు త్రైమాసికలకుగాను రాష్ట్ర ప్రభుత్వం నెలకు సగటున చేసిన అప్పు రూ.6,172 కోట్లుగా తేలింది. 
 
అందుబాటులో ఉన్న మార్గాలన్నింటిలో ప్రభుత్వం అప్పులు చేస్తుంది. ఫలితంగా గడిచిన మూడేళ్లలో ప్రభుత్వం చేసిన రుణం కేవలం రూ.34,452 కోట్లుగా ఉంది. అయితే, గత తొమ్మిది నెలల్లో ప్రభుత్వం చేసిన అప్పు ఎఫ్ఆర్‌బీఎం పరిమితులను మించిపోయి రూ.55,555 కోట్లకు చేరుకున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments