Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజుకు సగటున రూ.205 కోట్లు అప్పు చేస్తున్న సీఎం జగన్ సర్కారు

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2023 (12:48 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకునిపోతుంది. ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తుంది. సగటున రోజుకు రూ.205 కోట్లు చొప్పున అప్పు చేస్తుంది. గత 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం చేసిన రుణం రూ.55 వేల కోట్లు దాటేసింది. ప్రభుత్వం చేస్తున్న అప్పులపై విపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నా సీఎం జగన్ మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
 
పైగా, సీఎం జగన్ సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం చేస్తున్న అప్పులు సరికొత్త రికార్డులు నెలకొల్పేలా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో గడిచిన 9 నెలల కాలంలో ప్రభుత్వం చేసిన అప్పు స్థూలంగా రూ.55,555 కోట్లకు చేరుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొదటి మూడు త్రైమాసికలకుగాను రాష్ట్ర ప్రభుత్వం నెలకు సగటున చేసిన అప్పు రూ.6,172 కోట్లుగా తేలింది. 
 
అందుబాటులో ఉన్న మార్గాలన్నింటిలో ప్రభుత్వం అప్పులు చేస్తుంది. ఫలితంగా గడిచిన మూడేళ్లలో ప్రభుత్వం చేసిన రుణం కేవలం రూ.34,452 కోట్లుగా ఉంది. అయితే, గత తొమ్మిది నెలల్లో ప్రభుత్వం చేసిన అప్పు ఎఫ్ఆర్‌బీఎం పరిమితులను మించిపోయి రూ.55,555 కోట్లకు చేరుకున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ.. చెలియా నుంచి చిరుగాలి.. పాటను విడుదల చేసిన మంచు మనోజ్

Tran: Aries..; ట్రాన్: ఏరీస్.. డిస్నీ నుండి కొత్త పోస్టర్, ట్రైలర్ విడుదల

Manoj: తండ్రి, గురువు అయిన మోహన్ బాబుకు శుభాకాంక్షలు తెలిపిన మంచు మనోజ్

మహావతార్ నరసింహ తర్వాత హోంబలే ఫిల్మ్స్ వీర చంద్రహాస రాబోతోంది

Allari Naresh,: అల్లరి నరేష్, రుహాని శర్మ థ్రిల్లర్ డ్రామా గా ఆల్కహాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments