Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజుకు సగటున రూ.205 కోట్లు అప్పు చేస్తున్న సీఎం జగన్ సర్కారు

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2023 (12:48 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకునిపోతుంది. ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తుంది. సగటున రోజుకు రూ.205 కోట్లు చొప్పున అప్పు చేస్తుంది. గత 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం చేసిన రుణం రూ.55 వేల కోట్లు దాటేసింది. ప్రభుత్వం చేస్తున్న అప్పులపై విపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నా సీఎం జగన్ మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
 
పైగా, సీఎం జగన్ సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం చేస్తున్న అప్పులు సరికొత్త రికార్డులు నెలకొల్పేలా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో గడిచిన 9 నెలల కాలంలో ప్రభుత్వం చేసిన అప్పు స్థూలంగా రూ.55,555 కోట్లకు చేరుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొదటి మూడు త్రైమాసికలకుగాను రాష్ట్ర ప్రభుత్వం నెలకు సగటున చేసిన అప్పు రూ.6,172 కోట్లుగా తేలింది. 
 
అందుబాటులో ఉన్న మార్గాలన్నింటిలో ప్రభుత్వం అప్పులు చేస్తుంది. ఫలితంగా గడిచిన మూడేళ్లలో ప్రభుత్వం చేసిన రుణం కేవలం రూ.34,452 కోట్లుగా ఉంది. అయితే, గత తొమ్మిది నెలల్లో ప్రభుత్వం చేసిన అప్పు ఎఫ్ఆర్‌బీఎం పరిమితులను మించిపోయి రూ.55,555 కోట్లకు చేరుకున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments