Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు చంపేస్తారనీ.. దళిత యువకుడి ఆత్మహత్య...

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2020 (10:24 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో దళిత యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అధికార వైకాపా నేతలు బెదిరింపులకు భయపడి తనువు చాలించాడు. ఈ విషాదకర ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని  పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం కందూరు గ్రామం బండకాడపల్లి  దళితవాడకు చెందిన ఓం ప్రతాప్ అనే యువకుడు మద్య నిషేధం పేరుతో జగన్ రెడ్డి చేస్తున్న దోపిడీ గురించి సోషల్ మీడియాలో తన ఆవేదనను వెళ్లగక్కాడు. 
 
జగన్ రెడ్డి బ్రాండ్లు, అధిక రేట్లతో పేదలను ఏ విధంగా దోచుకుంటున్నారో ఓం ప్రతాప్ వివరించాడు. ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి గెలిపించినందుకు మమల్ని దోచుకుంటావా జగన్ రెడ్డి అంటూ యువకుడు ప్రశ్నించాడు. నాలుగైదు రోజుల క్రితం మదనపల్లిలో ఓ వైన్ షాపు వద్ద ఓం ప్రతాప్ తన ఆవేదనను వెళ్లగక్కుతూ పోస్టు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 
 
దీంతో రంగంలోకి దిగిన ఆ జిల్లాకు చెందిన మంత్ర పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ రెడ్డప్ప మనుషులు బెదిరింపులకు దిగినట్టు సమాచారం. పైగా చంపేస్తాం అంటూ ఫోనులో బెదిరిస్తూ వేధించినట్టు వినికిడి. వారి వేధింపులు భరించలేని ఓం ప్రతాప్ ఆత్మహత్య చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments