Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొడాలి నానివి ఒళ్లు కొవ్వెక్కిన మాటలు - వాళ్లంతా పందికొక్కులు

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2020 (10:15 IST)
అధికార వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ దేవినేని ఉమామహేశ్వర రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని మంత్రి కొడాలి నాని చేస్తున్న వ్యాఖ్యలపై మండిపడ్డారు. కొడాలి నానివి ఒళ్లు కొవ్వెక్కిన వ్యాఖ్యలంటూ ఘాటైన పదజాలంతో మండిపడ్డారు. పైగా, ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు పందికొక్కుల్లా మారిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
మంత్రి నాని చేసిన విమర్శలపై దేవినేని ఉమ స్పందించారు. యేడాదిన్నరలో జగన్‌ ప్రభుత్వం అవినీతి ఊబిలో కూరుకుపోయి తన అసమర్థతను, చేతగానితనాన్ని ప్రతిపక్షంపై నెట్టాలనుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. కాస్త ఆలస్యమైనా న్యాయం, ధర్మం గెలుస్తాయన్న సీఎం వ్యాఖ్యలు ఆయన ప్రభుత్వానికే వర్తిస్తాయన్నారు. 
 
పేదల సెంటు పట్టా భూమి పేరుతో మంత్రులు, ఎమ్మెల్యేలు పందికొక్కుల్లా ప్రజల సొమ్ము తినేశారన్నారు. తూర్పు గోదావరి ఆవ భూముల్లో రూ.500 కోట్ల వరకు స్వాహా చేశారన్నారు. శ్రీకాకుళం, విశాఖ, కర్నూలు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయని ఆరోపించారు. 
 
అటవీ భూములు, పాఠశాలల స్థలాలు, చెరువులు, కొండలు, గుట్టలు, శ్మశానాలు, అసైన్డ్‌, ముంపు ప్రాంతాల్లో భూములను పేదలకు ఇస్తున్నారన్నారు. ఇళ్ల స్థలాల కోసం రూ.9 వేల కోట్లు ఖర్చు చేశామని సీఎం చెబుతున్నారు.. అందులోను రూ.3 వేల కోట్లు అవినీతి జరిగిందన్నారు. ఈ ఉదంతాలపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్‌ చేస్తే జగన్‌ స్పందించలేదన్నారు. 
 
మాజీ సీఎం చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని ఒళ్లు కొవ్వొక్కి అనుచిత వ్యాఖ్యలు చేశాడని మండిపడ్డారు. ఇలాంటి వారికి ప్రజలే తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మాజీ మంత్రి దేవినేని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments