Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.562 కోట్ల ఎస్.ఎస్.ఎ. నిధుల కోసం కేంద్రానికి లేఖ రాస్తా... అనిల్ చంద్ర

Webdunia
బుధవారం, 14 నవంబరు 2018 (21:05 IST)
అమరావతి : రాష్ట్రంలో సమగ్ర శిక్షా అభియాన్ పథకం(ఎస్.ఎస్.ఎ.) కింద చేపట్టిన నిర్మాణాలు, పథకాలు సకాలంలో పూర్తికి తరుచూ సమీక్షలు, తనిఖీలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠ ఆదేశించారు. శిక్షా అభియాన్ కింద కేంద్ర ప్రభుత్వ వాటాగా రావాల్సిన రూ.562.58 కోట్ల గురించి త్వరలో కేంద్రానికి లేఖ రాయనున్నట్లు ఆయన వెల్లడించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో సమగ్ర సర్వశిక్షా అభియాన్ పథకం అమలు తీరుపై సీఎస్ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. 
 
ముందుగా రాష్ట్ర ప్రాథమిక విద్యా శాఖ కమిషనర్ సంధ్యరాణి... రాష్ట్రంలో సమగ్ర శిక్షా అభియాన్ పథకం(ఎస్.ఎస్.ఎ.) కింద చేపట్టిన నిర్మాణాలు, విద్యా పథకాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. సర్వశిక్షా అభియాన్ ను కేంద్ర ప్రభుత్వం సమగ్ర శిక్షా అభియాన్ గా మార్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో 352 కస్తూరిభా గాంధీబాలిక విద్యాలయాలు(కేజీబీవీ) ఉన్నాయని, వాటిలో 71,495 మంది విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారని ఆమె తెలిపారు. 2017-18 పదో పరీక్షల్లో 99.17 శాతం మేర కేజీబీవీ విద్యార్థినులు ఉత్తీర్ణులు కావడంపై సీఎస్ అనిల్ చంద్ర పునేఠ సంతృప్తి వ్యక్తంచేశారు. 
 
కస్తూరిభా గాంధీ బాలిక విద్యాలయాల ప్రహారీ గోడలు నిర్మాణాల ప్రగతి ఎంతవరకూ వచ్చిందని సీఎస్ ప్రశ్నించారు. 186 కస్తూరిభా గాంధీ బాలిక విద్యాలయాలకు ప్రహారీ గోడలు నిర్మించామని, త్వరలో 152 విద్యాలయాల ప్రహారీ గోడల నిర్మాణాలు పూర్తి చేస్తామని ఎస్.ఎస్.ఎ. ఈఈ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 2018-19 కు సంబంధించి కేంద్ర ప్రభుత్వ వాటాగా రావాల్సిన రూ.562.58 కోట్లు ఇంకా విడుదల కాలేదని సీఎస్ దృష్టికి రాష్ట్ర ప్రాథమిక విద్యా శాఖ కమిషనర్ సంధ్యరాణి తీసుకొచ్చారు. దీనిపై ఆయన స్పందిస్తూ, తనకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులపై పూర్తి స్థాయి నివేదిక అందజేయాలన్నారు. 
 
నివేదక రాగానే, నిధుల కోసం త్వరలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు ఆయన వెల్లడించారు. సమగ్ర సర్వశిక్షా అభియాన్ పూర్తిస్థాయిలో అమలుకావడానికి తరుచూ సమీక్షలు, తనిఖీలు నిర్వహించాలని కమిషనర్ సంధ్యరాణిని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ఎస్.ఎస్.ఏ ఫైనాన్స్ కంట్రోలర్ లక్ష్మీ కుమారి, ఎ.ఎస్.డి.పి.లు కె.నాగేశ్వరరావు, భరత్ కుమార్, ఎస్.ఎ.ఎం.ఓ. పి.విజయలక్ష్మి తదిరతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments