Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో పెరిగిన కరోనా కేసులు.. 120మందికి పాజిటివ్.. వ్యాక్సిన్ రికార్డ్

Webdunia
బుధవారం, 10 మార్చి 2021 (18:37 IST)
ఆంధ్రప్రదేశ్‌ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 48,973 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 120 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 
 
గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా ఒకరు మృతి చెందారు. అదే సమయంలో 93 మంది రికవరీ అయ్యారు. దీంతో.. పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,91,004 కి చేరగా.. కోలుకున్నవారి సంఖ్య 8,82,763 కి చేరింది. ఇక, ఇప్పటి వరకు కరోనాతో 7,177 మంది మృతిచెందారు. 
 
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ శరవేగంగా జరుగుతోంది. సోమవారం ఒక్కరోజే 20 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు ఇదే అత్యధికమని తెలిపింది. ఈ నెల 8 నాటికి వ్యాక్సినేషన్ డ్రైవ్ కు 50 రోజులైందని.. ఆ రోజు 20,19,723 మందికి టీకా వేశామని చెప్పింది.
 
వీరిలో 17,15,380 మందికి ఫస్ట్ డోస్.. 3,04,343 మందికి సెకండ్ డోస్ ఇచ్చామని వివరించింది. ఫస్ట్ డోస్ తీసుకున్నోళ్లలో 60 ఏండ్లకు పైబడినోళ్లు 12,22,351 మంది, 45 ఏండ్లకు పైబడి కోమార్బిటీస్ ఉన్నోళ్లు 2,21,148 మంది ఉన్నారంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments