Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి.. అప్పుడే అభివృద్ధి : జగన్

Webdunia
శనివారం, 20 ఫిబ్రవరి 2021 (14:51 IST)
ప్రధాని మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 6 వ సమావేశం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఏపి సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్ నుంచి పాల్గొన్నారు. 
 
పారిశ్రామికంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, అప్పుడే రాష్ట్రం పారిశ్రామికాభివృద్ధిని సాధిస్తుందని జగన్ పేర్కొన్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో ప్రత్యేక హోదా అంశంపై జగన్ ప్రస్తావించారు. విభజనకు ముందు ప్రత్యేక హోదా ఇస్తారని పార్లమెంట్ లో చెప్పారని జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. 
 
పోలవరం విషయంలో సవరించిన అంశాలకు ఆమోదం తెలపాలని కోరారు. అలానే రాష్ట్రంలో 13 మెడికల్ కాలేజీలకు అనుమతులను కోరారు జగన్. ఇక ఇదిలా ఉంటె, కేంద్ర సర్కార్ జీఎస్టీ పరిహారాన్ని రిలీజ్ చేసింది. 
 
17 వ విడత జీఎస్టీ పరిహారాన్ని రాష్ట్రాలకు విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ కు 2,222.71 కోట్లు ఉండగా, తెలంగాణకు రూ.1940.95 కోట్లు ఉన్నాయి. మొత్తం 91,640.34 కోట్ల రూపాయలను కేంద్రం రాష్ట్రాలకు రిలీజ్ చేసింది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments