Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్ ఆడుతూ గొడవ.. బ్యాట్‌తో కొట్టడంతో 9వ తరగతి విద్యార్థి మృతి

Webdunia
బుధవారం, 27 ఏప్రియల్ 2022 (13:09 IST)
క్రికెట్ ఆడుతుండగా ఏర్పడిన గొడవతో తొమ్మిదో తరగతి విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన ఘటన కాకినాడలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలోని జి.కొత్తూరు గ్రామానికి చెందిన బాలుడు 7వ తరగతి.. నంగి సూర్య (14) 9వ తరగతి చదువుతున్నారు. 
 
సోమవారం సాయంత్రం క్రికెట్ ఆడుతున్న సమయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో సూర్య వెళ్తున్న సైకిల్‌ను మరో బాలుడు తన్నాడు.
 
దీంతో ఇద్దరు గొడవకు దిగగా.. అక్కడ ఉన్న యువకులు వారిని విడిపించారు. అనంతరం కింద పడిపోయిన సైకిల్‌ను సూర్య తీసుకుంటుండగా.. వెనుకనుంచి ఆ బాలుడు బ్యాట్‌తో తలపై కొట్టాడు. స్పృహ తప్పి కిందపడిపోయిన సూర్య.. కాసేపయ్యాక తేరుకున్నాడు. 
 
అలా ఇంటికెళ్లి నిద్రపోయాడు. తెల్లవారు జామున నిద్రపోతున్న సూర్యను లేపగా.. అతను లేవలేదు. గురక వస్తుండడంతో వెంటనే బిక్కవోలు ఆసుపత్రికి తీసుకెళ్లాడు.
 
అయితే అప్పటికే ఆ సూర్య మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం పిల్లల మధ్య జరిగిన ఘర్షణ గురించి తెలుసుకున్న సూర్య తాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్రికెట్ ఆటలో జరిగిన ఘర్షణ అని.. వారి మధ్య ఎటువంటి పూర్వ తగాదాలు లేవని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments