Webdunia - Bharat's app for daily news and videos

Install App

జత్వానీ కేసులో పీఎస్ఆర్ ఆంజనేయలు అరెస్టు - నేడు కోర్టులో హాజరు

ఠాగూర్
బుధవారం, 23 ఏప్రియల్ 2025 (08:51 IST)
ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ముంబైకి చెందిన బాలీవుడ్ నటి జైత్వానీ కాందబరిని వేధించిన కేసులో పీఎస్ఆర్‌ను మంగళవారం అరెస్టు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా, విజయవాడలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో అధికారులు ఆయనను లోతుగా ప్రశ్నించారు. 
 
ఉదయం ప్రారంభమైన విచారణ సుమారు ఏడు గంటల పాట కొనసాగినట్టు సమాచారం. విచారణ సందర్భంగా ఈ కేసుకు సంబంధించి పలు కీలక పత్రాలను కూడా సీఐడీ అధికారులు సేకరించినట్టు తెలుస్తోంది. మంగళవారం రాత్రికి ఆంజనేయులు సీఐడీ కార్యాలయంలోనే ఉంచి, బుధవారం ఉదయం కోర్టు ముందు హాజరుపరచనున్నట్టు అధికారులు తెలిపారు. 
 
ఇదిలావుండగా, పీఎస్ఆర్‌ ఆంజనేయులుపై మరో కేసు కూడా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణను తుపాకీతతో బెదిరించారన్న ఆరోపణలపై గుంటూరులోని సీఐడీ పోలీస్ స్టేషన్‌లో కొత్తగా కేసు నమోదు చేసినట్టు తెలిసింద్. ఈ రెండు కేసులకు సంబంధించి తదుపరి విచారణ కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments