Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూకబ్జాకు పాల్పడితే 14 యేళ్ల జైలుశిక్ష - ఏపీ సర్కారు కీలక నిర్ణయం

ఠాగూర్
గురువారం, 7 నవంబరు 2024 (10:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భూకబ్జాలకు పాల్పడే వారికి 14 యేళ్ల జైలుశిక్ష విధించేలా చట్టాన్ని తీసుకునిరానున్నారు. రాష్ట్రంలో ఇష్టానుసారం, ప్రభుత్వ పట్టా భూముల ఆక్రమలకు పాల్పడినవారికి తగిన గుణపాఠం చెప్పేలా అలాంటి కఠిన శిక్షలు విధించి, భారీ జరిమానాలతో చెక్ పెట్టేలా రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోస ప్రస్తుతం ఉన్న భూఆక్రమణల నిరోధక చట్టాన్ని రద్దు చేసి, దాని స్థానంలో కొత్త బిల్లుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ బిల్లులు ప్రకారం ఇకపై భూఆక్రమణలకు పాల్పడేవారికి గరిష్టంగా 14 యేళ్ల వరకు శిక్ష విధించవచ్చు. అలాగే, ఏపీ డ్రోన్ పాలసీ , డేటా సెంటర్ల పాలసీ, సెమీ కండక్టర్ల పాలసీల అమలుకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. అదేవిధంగా రాజధాని ప్రాంత అభివృద్ధి  సంస్థ - సీఆర్డీఏ పరిధి పెంపునకు ఆమోదం తెలిపింది. 
 
ప్రభుత్వ, ప్రైవేటు భూములు ఆక్రమించుకోవడం, ఎక్కడో దూరంగా ఉంటున్నవారి భూములను కబ్జా చేయడం, పేదల భూములు లాక్కోవడం, నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు వంటివి నియంత్రించడం కోమే, ఏపీ భూఆక్రమణల నిరోధక చట్టం 1982ను రద్దు చేసి, దాని స్థానంలో ఏపీ భూఆక్రమణల నిరోధక చట్టం 2024 అమలుకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పాత చట్టం పట్టణ ప్రాంతాల్లోని ఆస్తులకే పరిమితమైంది. కానీ, కొత్త చట్టం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో భూముల రక్షణకు వీలు కల్పించనుంది. అలాగే, ఆక్రమణదారులకు 10 నుంచి 14 యేళ్ల జైలుశిక్ష, భూమి విలువతోపాటు నష్టపరిహారం కలిపి జరిమానా విధిస్తారు. ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి నిర్ణీత కాలంలో కేసుల పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sankranthiki Vasthunam: గోదారి గట్టు మీద రామచిలుకవే పాటకు థియేటర్‌లో స్టెప్పులేసిన జంట

Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ ఫ్యామిలీ గురించి తెలుసా.. ఆస్తుల సంగతేంటి?

నా లెగసీని కంటిన్యూ చేసే వారిలో కిషోర్ ఒకరు : బ్రహ్మానందం

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ తో మోసం చేశారన్న వెన్నెల కిశోర్

కిరణ్ అబ్బవరం దిల్ రూబా నుంచి సింగిల్ అగ్గిపుల్లె..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

శిశువు గుండె భాగంలోకి వెళ్లిపోయిన లివర్, కిడ్నీలు, పేగులు: ప్రాణాల‌ను కాపాడిన లిటిల్ స్టార్- షీ ఉమెన్- చిల్డ్రన్ హాస్పిటల్‌

కిడ్నీలను డ్యామేజ్ చేసే అలవాట్లు, ఏంటవి?

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

సర్వరోగ నివారిణి తులసి రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments