Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలును రెండో రాజధానిగా చేయండి : బీజేపీ నేతల డిమాండ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కర్నూలును రెండో రాజధానిగా చేయాలని భారతీయ జనతా పార్టీకి చెందిన రాష్ట్ర నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం వారు రాయలసీమ పేరుతో ఓ డిక్లరేషన్ పేరుతో ఓ తీర్మానం చేశారు.

Webdunia
శనివారం, 24 ఫిబ్రవరి 2018 (20:16 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కర్నూలును రెండో రాజధానిగా చేయాలని భారతీయ జనతా పార్టీకి చెందిన రాష్ట్ర నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం వారు రాయలసీమ పేరుతో ఓ డిక్లరేషన్ పేరుతో ఓ తీర్మానం చేశారు. 
 
రాయలసీమలో రెండో రాజధాని, హైకోర్టు, గవర్నర్ తాత్కాలిక విడిది, సీఎం నివాసం ఏర్పాటు చేయాలని, రాయలసీమలో అసెంబ్లీ భవనం ఏర్పాటు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. రాయలసీమలో 6 నెలలకోసారి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని, రాయలసీమ ప్రాజెక్టులకు బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లు కేటాయించాలంటూ డిమాండ్ చేశారు. 
 
దీనికి తెలుగుదేశం పార్టీకి చెందిన రాయలసీమ నేతలు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ముఖ్యంగా, టీడీపీ సీనియర్ నేత, ఎంపీ టీజీ వెంకటేష్ బీజేపీ నేతల తీర్మానాని సమర్థించారు. 15 ఏళ్లుగా కర్నూలును రెండో రాజధాని చేయాలని వాదిస్తున్నానని అన్నారు. సీమలో రెండో రాజధానికోసం మద్దతు తెలిపేవారందరినీ టీజీ స్వాగతించారు. 
 
కాగా, రాష్ట్ర విభజన అనంతరం అమరావతిని నవ్యాంధ్ర రాజధానిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంపిక చేసి దాన్ని అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమైవున్నారు. ఈ రాజధాని నిర్మాణానికే నిధులు లేకపోవడంతో ఆయన మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు కర్నూలును రెండో రాజధానిగా చేయాలంటూ సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకుని రావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments