Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వాళ్ళనొదిలి నన్ను పట్టుకుంటారేంటి... మీడియాపై మంత్రి చిందులు

ఏపీలో ప్రస్తుతం ప్రత్యేక హోదా అంశం హీటెక్కుతోంది. అధికార టీడీపీ - బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఏ నిమిషమైనా తెగిపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావి

వాళ్ళనొదిలి నన్ను పట్టుకుంటారేంటి... మీడియాపై మంత్రి చిందులు
, బుధవారం, 21 ఫిబ్రవరి 2018 (11:35 IST)
ఏపీలో ప్రస్తుతం ప్రత్యేక హోదా అంశం హీటెక్కుతోంది. అధికార టీడీపీ - బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఏ నిమిషమైనా తెగిపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏకంగా బీజేపీ వారే తెదేపా నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. 
 
మొదట్లో సోము వీర్రాజు, ఆ తర్వాత దేవదాయశాఖామంత్రి మాణిక్యాలరావు, ఎమ్మెల్సీ మాధవన్ అలా మరికొందరు ఉన్నారు. అయితే బీజేపీకి సంబంధించి మంత్రిగా ఉన్న ఒక్క వైద్య, ఆరోగ్య శాఖామంత్రి కామినేని శ్రీనివాస్ మాత్రం తెదేపా నేతలపై ఎలాంటి విమర్శలు చేయడం లేదు. అంతేకాదు మీడియా కనిపిస్తే భయపడిపోతున్నారాయన. మీడియా అడిగే ప్రశ్నలకు ఎక్కడ ఇరుక్కుంటామేమోనన్న భయం మంత్రిలో కనిపిస్తోంది. 
 
అందుకే తిరుపతిలో పర్యటించిన మంత్రి కామినేని మీడియా ప్రతినిధులు దణ్ణం పెట్టేశారు. మాణిక్యాలరావు మాట్లాడినా, సోము వీర్రాజు మాట్లాడినా, లేదా ఇతర బీజేపీ నేతలు ఎవరు మాట్లాడిన.. వారినే మీరు వారినే అడగాలి. మమ్మల్ని కాదు అంటూ మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. "నాకు తెలిసినంత వరకు నాలుగేళ్ళపాటు టీడీపీ-బీజేపీల స్నేహబంధంలో ఏపీ అభివృద్ధి పథంలో నడిచిందన్న నమ్మకం ఉంది. పొత్తుల విషయం అధిష్టానం చూసుకుంటుంది. వారు ఏం చేయమంటే అది చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ మంత్రి కామినేని శ్రీనివాస్ వెళ్లిపోయారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోడీ కాళ్లు మొక్కేందుకు బాబు ఢిల్లీకి వెళుతున్నారు : సీపీఐ జాతీయ నేత