జగన్ వర్సెస్ చంద్రబాబు: నువ్వేమీ చేయలేవు.. అసలు నువ్వేమి పీకగలవు?

Webdunia
సోమవారం, 30 నవంబరు 2020 (21:15 IST)
ఒకరేమో రాష్ట్రముఖ్యమంత్రి.. మరొకరేమో రాష్ట్రానికి ప్రతిపక్షనేత. వీరిద్దరు అసెంబ్లీలో సంయమనం కోల్పోయారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతను రెచ్చగొట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు ఇప్పుడు చర్చకు దారితీస్తే.. నువ్వేమీ పీకలేవ్ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు మరింత దుమారాన్నే రేపుతున్నాయి.
 
వారిద్దరు ప్రజాప్రతినిధులు. ఎలాంటి విషయాన్నయినా సంయమనంతో వ్యవహరించాలి. అదే విధంగా మాట్లాడాలి. కానీ ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి నవ్వుతూ రెండు చేతులు ఊపుతూ మీరేమీ చేయలేరు అంటూ చంద్రబాబును చూస్తూ ఎగతాళి చేశారు. 
 
వరదతో రైతులు ఇబ్బందులు పడ్డారు. లక్షల హెక్టార్ల పంట కొట్టుకుపోయింది అంటూ చంద్రబాబుతో పాటు సహచర ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడే ప్రయత్నం చేస్తుండగా మీరేమీ చేయలేరంటూ చేతులెత్తుతూ సైగలు చేశారు జగన్మోహన్ రెడ్డి. దీంతో చంద్రబాబుకు కోపమొచ్చింది. నువ్వేమి పీకుతావు అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు.
 
నేరుగా పోడియం ముందుకు వచ్చి కూర్చున్నారు. ఇది కాస్త పెద్ద దుమారాన్నే రేపింది. స్పీకర్ మాటలను టిడిపి సభ్యులు పట్టించుకోకపోవడంతో సభ నుంచి వాకౌట్ చేసేశారు. కానీ ఇద్దరు నేతల మధ్య మాత్రం జరిగిన ఈ రచ్చ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం హాట్ టాపిక్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కాలికి దెబ్బ తగిలితే నిర్మాత చిట్టూరి సెంటిమెంట్ అన్నారు : అల్లరి నరేష్

Nayanthara: బాలకృష్ణ, గోపీచంద్ మలినేని చిత్రంలో నయనతార లుక్

అర్జున్, ఐశ్వర్య రాజేష్ ల ఇన్వెస్టిగేటివ్ డ్రామాగా మఫ్టీ పోలీస్ సిద్ధం

రాజు వెడ్స్ రాంబాయి కి కల్ట్ మూవీ అనే ప్రశంసలు దక్కుతాయి - తేజస్వినీ, అఖిల్ రాజ్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments