Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ సీఎం జగన్‌పై మరో కేసు నమోదు

ఠాగూర్
మంగళవారం, 24 జూన్ 2025 (14:08 IST)
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. గత ఫిబ్రవరి 19వ తేదీన ఆయన గుంటూరు జిల్లా మిర్చియార్డు పర్యటనకు వచ్చారు. ఆ సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ, పోలీసుల అనుమతి లేకుండా ఈ పర్యటనకువచ్చారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు వైకాపా నేతలకు నల్లపాడు పోలీసులు నోటీసులు ఇచ్చారు. 
 
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్పప్పటికీ వైకాపా నేతలు అనుమతి లేకుండా వచ్చి హడావుడి చేశారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నడిచే యార్డులో జగన్ రాజకీయ ప్రసంగాలు చేశారు. ఈ నేపథ్యంలో జగన్‌తో పాటు నేతలు అంబటి రాంబాబు, లేళ్ళ అప్పిరెడ్డి, కావడి మనోహర్ నాయుడు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తదితరులపై కేసు నమోదైంది.
 
ఇప్పటికే పోలీసులు వారికి 41ఏ నోటీసులు ఇచ్చారు. పిలిచినపుడు నల్లపాడు ఠాణాకు విచారణకు రావాలని సూచించారు. కాగా, పల్నాడు జిల్లాలోని రెంటపాళ్లలో జగన్ పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా చిలీ సింగయ్య అనే వ్యక్తి జగన్ కారు కింద పడి మృతి చెందాడు. దీనిపై జగన్‌పై ఇప్పటికే కేసు నమోదైన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: సమంతకి సినిమా కష్టాలు - రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్‌ హుష్ కాకీ

Mohanbabu: కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ లోనే ఎందుకు చేశారో తెలుసా

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments