Webdunia - Bharat's app for daily news and videos

Install App

24 నెలలు... 32 అత్యాచారాలు... ప్రేమజంటలే లక్ష్యంగా...

Webdunia
సోమవారం, 4 మార్చి 2019 (09:09 IST)
ఏలూరులో ప్రేమ జంటలను లక్ష్యంగా చేసుకుని అత్యాచారాలు చేస్తున్న రేప్ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గత 24 నెలల్లో 32 అత్యాచారాలు శారు. తమ దారికిరాని వారిని హత్య కూడా చేశారు. అలా మూడు హత్యలు చేశారు. 
 
ఇటీవల బౌద్దారామాల వద్ద ప్రేమ జంటపై దాడి, ఆపై యువతి హత్య కేసు రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. దీనిపై కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు..... అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి చివరకు నలుగురు హంతకులను అరెస్టు చేశారు. వీరిని జిల్లా పోలీసు కార్యాలయంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు. 
 
ఈ సందర్భంగా హంతకుల నేపథ్యాన్ని పోలీసులు వివరించారు. హంతకులు వృత్తిగా అడవి పందులు, జంతువులను, పక్షులను వేటాడేవారు. ప్రవృత్తిగా ప్రేమ జంటలే టార్గెట్‌. 24 నెలల్లో నాలుగు హత్యలు, 32 అత్యాచారాలకు తెగబడ్డారు. ఇప్పటికే మూడు హత్యలు, మూడు అత్యాచారాలపై కేసులు నమోదైనా ఈ నేరస్తులను సంబంధిత పోలీసులు అరెస్టు చేయలేకపోయారు. 
 
జిల్లాలోని బౌద్దారామాల వద్ద జరిగిన ప్రేమజంటపై దాడిపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి హంతకులను అరెస్టు చేయగలిగారు. వీరు చెప్పిన నేరాలను విన్న పోలీసులే అవాక్కయ్యారు. వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments