Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తల్లి వయసున్న మహిళపై అత్యాచారయత్నం..

తల్లి వయసున్న మహిళపై అత్యాచారయత్నం..
, శుక్రవారం, 1 మార్చి 2019 (15:56 IST)
తల్లితో సెమినార్‌కి వెళ్లిన యువకుడు తల్లితోపాటు పనిచేసే సహోద్వోగినిపై కన్నేశాడు ఓ కామాంధుడు. ఆపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. తన తల్లిలాంటి దానినని చెబుతున్నా వినలేదు. ఈ ఘటన బెంగుళూరులో చోటుచేసుకుంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కోల్‌కతాకు చెందిన యువతి ఇంజినీరింగ్ పూర్తిచేసి అక్కడే ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఈమె తల్లి కూడా కోల్‌కతాలో ఉద్యోగం చేస్తోంది. ఈమె కంపెనీ పనిమీద బెంగుళూరుకు ఓ సెమినార్‌కు వెళ్లవలసి వచ్చింది. ఈ విషయం తెలిసిన కుమార్తె కూడా తాను కూడా బెంగుళూరుకు వస్తానని తల్లికి చెప్పగా ఆమె సమ్మతించింది. 
 
ఈ సెమీనార్‌ను ఓ నక్షత్ర హోటల్‌లో ఏర్పాటు చేయగా, తల్లీకుమార్తెతో పాటు సహోద్యోగులు కూడా పాల్గొన్నారు. అక్కడ ఆ ఆకతాయి మహిళపై కన్నేశాడు. సెమినార్ ముగిసిన తర్వాత ఆమె గది వద్దకు వెళ్లాడు. మంచినీళ్లు ఇప్పించమని అడిగాడు. నీళ్లు తెచ్చేలోగా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటించడంతో లాక్కుంటూ బాత్‌రూంలోకి వెళ్లాడు. 
 
తన తల్లిలాంటి దానినని ఎంత ప్రాధేయపడినా మద్యం మత్తులో ఉన్న ఆ కామాంధుడు వినలేదు. దాడికి దిగాడు. ఆమె గట్టిగా కేకలు వేసింది. ఇక సాధ్యపడదనుకుని తిరిగి వచ్చేటప్పుడు అమెకు ముద్దు పెట్టి వచ్చేశాడు. ఈ ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం అతని పేరు ముఖర్జీ. బాధితురాలి పేరు బయటపెట్టడానికి నిరాకరించిన పోలీసులు, ఆమె వయస్సు 39 ఏళ్లు ఉంటుందని తెలిపారు. అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు చెప్పారు. 
 
తల్లితో సెమినార్‌కి వెళ్లిన యువకుడు తల్లితోపాటు పనిచేసే సహోద్వోగినిపై కన్నేశాడు ఓ కామాంధుడు. ఆపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. తన తల్లిలాంటి దానినని చెబుతున్నా వినలేదు. ఈ ఘటన బెంగుళూరులో చోటుచేసుకుంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కోల్‌కతాకు చెందిన యువతి ఇంజినీరింగ్ పూర్తిచేసి అక్కడే ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఈమె తల్లి కూడా కోల్‌కతాలో ఉద్యోగం చేస్తోంది. ఈమె కంపెనీ పనిమీద బెంగుళూరుకు ఓ సెమినార్‌కు వెళ్లవలసి వచ్చింది. ఈ విషయం తెలిసిన కుమార్తె కూడా తాను కూడా బెంగుళూరుకు వస్తానని తల్లికి చెప్పగా ఆమె సమ్మతించింది. 
 
ఈ సెమీనార్‌ను ఓ నక్షత్ర హోటల్‌లో ఏర్పాటు చేయగా, తల్లీకుమార్తెతో పాటు సహోద్యోగులు కూడా పాల్గొన్నారు. అక్కడ ఆ ఆకతాయి మహిళపై కన్నేశాడు. సెమినార్ ముగిసిన తర్వాత ఆమె గది వద్దకు వెళ్లాడు. మంచినీళ్లు ఇప్పించమని అడిగాడు. నీళ్లు తెచ్చేలోగా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటించడంతో లాక్కుంటూ బాత్‌రూంలోకి వెళ్లాడు. 
 
తన తల్లిలాంటి దానినని ఎంత ప్రాధేయపడినా మద్యం మత్తులో ఉన్న ఆ కామాంధుడు వినలేదు. దాడికి దిగాడు. ఆమె గట్టిగా కేకలు వేసింది. ఇక సాధ్యపడదనుకుని తిరిగి వచ్చేటప్పుడు అమెకు ముద్దు పెట్టి వచ్చేశాడు. ఈ ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం అతని పేరు ముఖర్జీ. బాధితురాలి పేరు బయటపెట్టడానికి నిరాకరించిన పోలీసులు, ఆమె వయస్సు 39 ఏళ్లు ఉంటుందని తెలిపారు. అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రక్తదానం పేరుతో కిడ్నీ కాజేసిన వైద్యులు...