Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమర్నాథ్ యాత్రలో విషాదం - ఏపీ భక్తురాలు మృతి

Webdunia
సోమవారం, 11 జులై 2022 (15:06 IST)
పవిత్ర అమర్నాథ్ యాత్రలో విషాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళా భక్తురాలు ప్రాణాలు కోల్పోయింది. ఇటీవల ఆకస్మికంగా వర్షాలు కురవడంతో ఆ కారణంగా వరదలు వచ్చాయి. దీంతో అనేక మంది గల్లంతుకాగా, రాజమండ్రికి చెందిన ఇద్దరు మహిళలు కూడా ఉండగా, వీరిలో ఒకరైన గుణశెట్టి సుధ (48) చనిపోయినట్టు అధికారులు ధృవీకరించారు. 
 
గత రెండు రోజులుగా గాలింపు కొనసాగిస్తున్న నేపథ్యంలో సోమవారం శ్రీనగర్‌లోని ఆస్పత్రి మార్చురీలో సుధ మృతదేహాన్ని గుర్తించామని వారు వెల్లడించారు. మృతురాలు రాజమహేంద్రవరంలోని కుమారి టాకీస్‌ ప్రాంతానికి చెందినవారు. ఆమె మృతితో ఆ ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. మరో మహిళ పార్వతి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. 
 
ఇదిలావుంటే, నెల్లూరు జిల్లా నుంచి 82 మంది అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లారని కలెక్టర్‌ తెలిపారు. వీరిలో 57 మంది సురక్షితంగా ఉండగా.. మరో 25 మంది ఆచూకీ తెలియాల్సి వుందన్నారు. ఆచూకీ దొరకని వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నామన్నారు. నెల్లూరు జిల్లా యాత్రికుల కోసం 1902 టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరుత వేడుకలు జరుపుకుంటున్న రామ్ చరణ్ తేజ్ అభిమానులు

ఇంతకీ "దేవర" హిట్టా.. ఫట్టా...? తొలి రోజు కలెక్షన్లు ఎంత...?

మెగాస్టార్ చిరంజీవికి మరో ప్రతిష్టాత్మక అవార్డు!

అమరన్ నుంచి ఇందు రెబెకా వర్గీస్‌గా సాయి పల్లవి పరిచయం

ఆర్.ఆర్.ఆర్ సెట్‌లో నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ అసలైన చిరుతలతో పని చేశారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments