Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమర్నాథ్ యాత్రలో విషాదం - ఏపీ భక్తురాలు మృతి

Webdunia
సోమవారం, 11 జులై 2022 (15:06 IST)
పవిత్ర అమర్నాథ్ యాత్రలో విషాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళా భక్తురాలు ప్రాణాలు కోల్పోయింది. ఇటీవల ఆకస్మికంగా వర్షాలు కురవడంతో ఆ కారణంగా వరదలు వచ్చాయి. దీంతో అనేక మంది గల్లంతుకాగా, రాజమండ్రికి చెందిన ఇద్దరు మహిళలు కూడా ఉండగా, వీరిలో ఒకరైన గుణశెట్టి సుధ (48) చనిపోయినట్టు అధికారులు ధృవీకరించారు. 
 
గత రెండు రోజులుగా గాలింపు కొనసాగిస్తున్న నేపథ్యంలో సోమవారం శ్రీనగర్‌లోని ఆస్పత్రి మార్చురీలో సుధ మృతదేహాన్ని గుర్తించామని వారు వెల్లడించారు. మృతురాలు రాజమహేంద్రవరంలోని కుమారి టాకీస్‌ ప్రాంతానికి చెందినవారు. ఆమె మృతితో ఆ ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. మరో మహిళ పార్వతి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. 
 
ఇదిలావుంటే, నెల్లూరు జిల్లా నుంచి 82 మంది అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లారని కలెక్టర్‌ తెలిపారు. వీరిలో 57 మంది సురక్షితంగా ఉండగా.. మరో 25 మంది ఆచూకీ తెలియాల్సి వుందన్నారు. ఆచూకీ దొరకని వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నామన్నారు. నెల్లూరు జిల్లా యాత్రికుల కోసం 1902 టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments