Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాల డైయిరీ ఫ్యాక్టరీలో అమ్మోనియం గ్యాస్ లీక్

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (11:50 IST)
చిత్తూరు జిల్లాలో గ్యాస్ లీక్ ప్రమాదం జరిగింది. ఈ జిల్లాలో ఉన్న హాట్సన్ పాల డెయిరీ యూనిట్‌లో గురువారం రాత్రి అమ్మోనియం గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో 20 మందికి కార్మికులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వీరంతా అపస్మారకస్థితిలోకి జారుకోవడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 100 మందికిపైగా కార్మికులు ఉన్నట్టు తెలుస్తోంది.
 
సాధారణంగా ఫ్యాక్టరీకి వచ్చే పాలను కోల్డ్ స్టోరేజీలో నిల్వ ఉంచుతారు. ఇందుకోసం అమ్మోనియం వాయును ఉపయోగిస్తుంటారు. ఈ గ్యాస్ ప్రమాదవశాత్తు లీక్ కావడంతో ఈ ఘటన జరిగింది. అస్వస్థతకు గురైన కార్మికులను చిత్తూరు, గుడిపాల ఆసుపత్రులకు తరలించారు. 
 
అస్వస్థతకు గురైన వారిలో 14 మంది మహిళా కార్మికులు ఉన్నారు. ఈ ఘటనపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విచారణకు ఆదేశించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న కలెక్టర్ భరత్ గుప్తా డెయిరీని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments