Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి ప్రసాదం లడ్డూలో మొన్న పిన్ను.. నేడు నల్ల కాళ్ళజెర్రీ...

Webdunia
మంగళవారం, 10 మే 2016 (10:11 IST)
తిరుమల శ్రీవారి లడ్డూల మరోసారి నిర్లక్ష్యం మరోసారి వెలుగుచూసింది. మొన్నటికి మొన్న శ్రీవారి లడ్డూలో పిన్ను కనిపించింది. ఓ లడ్డూలో పిన్ను ఉందంటూ ఓ భక్తుడు దాన్ని తిరిగిచ్చేశాడు. లడ్డూలో ఉన్న పిన్ను చూసి శ్రీవారి సేవకులు కూడా ఖంగుతిన్నారు. ఆ సంభవాన్ని మరువక ముందే మరో డొల్లతనం బయటపడింది. తిరుపతి లడ్డూలో జీడిపప్పులు, కిస్ మిస్, పటికబెల్లంతో పాటు ఇనుపముక్కలు, ప్లాస్టిక్ ముక్కలు వచ్చిన ఘటనలు చాలానే ఉన్నాయి. 
 
తాజాగా, తిరుపతి లడ్డూలో చనిపోయిన విషపూరిత నల్ల కాళ్ల జెర్రీ కనిపించింది. ఈ సంఘటన సోమవారం చోటుచేసుకుంది. పూర్తి వివరాలను పరిశీలిస్తే విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలోని రామాపురం కాలనీకి చెందిన గొన్నాబత్తుల దేవీ ప్రసాద్, త్రినాథ్ తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. అనంతరం లడ్డూలు కొనుగోలు చేశారు. తిరిగి ఆదివారం తమ గ్రామానికి చేరుకున్నారు. ప్రసాదాలు పంచేందుకు సోమవారం లడ్డూను ముక్కలు చేయగా జెర్రీ బయటపడడంతో భక్తులు ఖంగుతిన్నారు. ఈ సంఘటనపై తాము విస్మయం చెందామని, భక్తులు పవిత్రంగా భావించే ప్రసాదంలో ఇటువంటివి ఉండటం సరికాదని వారు మండిపడ్డారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అంచనాలను రెట్టింపు చేసిన దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్' ట్రైలర్

"కేరింత" హీరోకు సింపుల్‌గా పెళ్లైపోయింది.. వధువు ఎవరంటే?

"రాజా సాబ్" నుంచి కొత్త అప్డేట్.. పోస్టర్ రిలీజ్.. ప్రభాస్ అల్ట్రా స్టైలిష్‌ లుక్

ప్రభాస్ బర్త్ డే సందర్భంగా "రాజాసాబ్" నుంచి మోస్ట్ అవేటెడ్ అప్డేట్

చై - శోభిత పెళ్లి పనులు ప్రారంభం... పసుపు దంచుతున్న ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు ఒక్కసారి 4 టీ స్పూన్ల తులసి రసం తాగితే?

జీడిపప్పుకు అంత శక్తి వుందా?

ఫెర్టిలిటీ ఆవిష్కరణలపై ఫెర్టిజ్ఞాన్ సదస్సు కోసం తిరుపతిలో సమావేశమైన 130 మంది నిపుణులు

కాఫీలో నెయ్యి వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

ఖర్జూరం పాలుని పవర్ బూస్టర్ అని ఎందుకు అంటారు?

తర్వాతి కథనం
Show comments