మిథున్ రెడ్డికి కొత్త పరువు - దిండ్లు - ప్రొటీన్ పౌడర్ - కిన్లే వాటర్ - దోమతెర కావాలి...

ఠాగూర్
మంగళవారం, 22 జులై 2025 (09:10 IST)
ఏపీలో వెలుగు చూసిన మద్యం స్కామ్‌లో నాలుగో నిందితుడుగా అరెస్టయిన వైకాపా ఎంపీ, మాజీ మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే, జైలులో ఆయనకు లగ్జరీ సౌకర్యాలు కల్పించాలంటూ ఆయన తరపు న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యంగా ఉదయం వేళ అల్పాహారం, రెండు పూటలా ఇంటి భోజనం, కిన్లే వాటర్, కొత్త పరుపు, దిండు, దోమతెర, వెస్ట్రన్ కమోడ్ కలిగిన ప్రత్యేక గది, వాకింగ్ షూ వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు. 
 
జైల్లో తనకు ఈ ప్రత్యేక వసతులు కల్పించాలంటూ విజయవాడ ఏసీబీ కోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వీటితో పాటు ప్రొటీన్ పౌడర్, ఓ టేబుల్ దానిపై తెల్లకాగితం, పెన్ను ఏర్పాటు చేయాలని, యోగా మ్యాట్ ఇప్పించాలని కోరారు. ఈ పిటిషన్‌‍లపై విజయవాడ ఏసీబీ కోర్టు సోమవారం విచారణ జరిపింది. వాటిపై అభ్యంతరాలు ఉంటే చెప్పాలంటూ రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌ను ఆదేశించింది. మంగళవారం ఉదయం నేరుగా కోర్టుకు హాజరై అభ్యంతరాలు చెప్పాలని నిర్ధేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments