Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈవో ధర్మారెడ్డికి జైలుశిక్షి విధించిన హైకోర్టు.. నేడు అప్పీలు

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2022 (09:16 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డు ఎగ్జిక్యూటివ్ అధికారి ధర్మారెడ్డికి కోర్టు ధిక్కరణ చర్యల కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఒక నెల జైలుశిక్షను విధిస్తూ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు మంగళవారం సంచలన తీర్పునిచ్చింది. జైలుశిక్షతో పాటు రూ.2 వేల అపరాధం కూడా విధించింది. పైగా అపరాధం చెల్లించని పక్షంలో మరికొన్ని రోజులు జైలుశిక్ష అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించింది. అయితే, ఈ తీర్పుపై బుధవారం అప్పీల్ చేయాలని తితిదే భావిస్తుంది. అప్పీలు పిటిషన్‌పై హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో వేచిచూడాలి.
 
తితిదేలోని ముగ్గురు తాత్కాలిక ఉద్యోగులను గతంలో తమ సర్వీసుల క్రమబద్దీకరణపై హైకోర్టును ఆశ్రయించారు. ఆ ముగ్గురు సర్వీసులను క్రమబద్దీకరించాలని అప్పట్లో హైకోర్టు ఆదేశాలుజారీచేసింది. కానీ, వాటిని తితిదే అమలు చేయలేదు. దీంతో బాధిత ఉద్యోగులు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. తమ ఆదేశాలను తితిదే అమలు చేయనందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈవోగా పని చేస్తున్న ధర్మారెడ్డి నెల రోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments