Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈవో ధర్మారెడ్డికి జైలుశిక్షి విధించిన హైకోర్టు.. నేడు అప్పీలు

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2022 (09:16 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డు ఎగ్జిక్యూటివ్ అధికారి ధర్మారెడ్డికి కోర్టు ధిక్కరణ చర్యల కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఒక నెల జైలుశిక్షను విధిస్తూ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు మంగళవారం సంచలన తీర్పునిచ్చింది. జైలుశిక్షతో పాటు రూ.2 వేల అపరాధం కూడా విధించింది. పైగా అపరాధం చెల్లించని పక్షంలో మరికొన్ని రోజులు జైలుశిక్ష అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించింది. అయితే, ఈ తీర్పుపై బుధవారం అప్పీల్ చేయాలని తితిదే భావిస్తుంది. అప్పీలు పిటిషన్‌పై హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో వేచిచూడాలి.
 
తితిదేలోని ముగ్గురు తాత్కాలిక ఉద్యోగులను గతంలో తమ సర్వీసుల క్రమబద్దీకరణపై హైకోర్టును ఆశ్రయించారు. ఆ ముగ్గురు సర్వీసులను క్రమబద్దీకరించాలని అప్పట్లో హైకోర్టు ఆదేశాలుజారీచేసింది. కానీ, వాటిని తితిదే అమలు చేయలేదు. దీంతో బాధిత ఉద్యోగులు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. తమ ఆదేశాలను తితిదే అమలు చేయనందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈవోగా పని చేస్తున్న ధర్మారెడ్డి నెల రోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments