Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ సర్కారు కీలక నిర్ణయం.. చంద్రబాబు అక్రమాల వెలికితీతకు సిట్

Webdunia
శనివారం, 22 ఫిబ్రవరి 2020 (13:28 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను వెలికి తీసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. ఈ బృందానికి ఐపీఎస్‌ అధికారి కొల్లి రఘురామ్‌ రెడ్డి సారథ్యం వహిస్తారు. ఈయన ఆధ్వర్యంలో 10 మంది సభ్యులతో సిట్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
 
గతంలో మంత్రివర్గ ఉప సంఘం సమర్పించిన నివేదికలోని అంశాలపై సిట్‌ విచారణ చేపట్టనుంది. సీఆర్‌డీఏ పరిధిలోని సరిహద్దుల మార్పు, అవకతవకలు, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌, బినామీ లావాదేవీల ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం దృష్టి సారించనుంది. సీఆర్‌డీఏతో పాటు ఇతర ప్రాజెక్టుల్లోని అక్రమాల ఆరోపణలపైనా సిట్‌ విచారణ చేపట్టనుంది. 
 
ప్రత్యేక దర్యాప్తు బృందం సభ్యులుగా ఐపీఎస్‌ అధికారులు అట్టాడ బాబూజీ, వెంకట అప్పలనాయుడు, శ్రీనివాస్‌రెడ్డి, జయరామ్‌రాజు, విజయ్‌ భాస్కర్‌, గిరిధర్‌, కెనడీ, శ్రీనివాసన్‌, ఎస్వీ రాజశేఖర్‌రెడ్డిలను నియమించింది. సిట్‌కు ప్రభుత్వం విస్తృతాధికారాలు కట్టబెట్టింది. ఎవరినైనా విచారణకు పిలిచే అధికారం సిట్‌కు ఉందంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments