Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఆసరా నిలిపివేత... కరోనా మృతుల కుటుంబాలకు కూడా...

Webdunia
ఆదివారం, 6 సెప్టెంబరు 2020 (12:08 IST)
కరోనా వైరస్ బారినపడి కోలుకుంటున్న వారికి ఆసరా పథకం కింద ఇస్తూ వచ్చిన రూ.2 వేల ఆర్థిక సాయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో ప్రభుత్వంపై ఆర్థికభారం పెరిగిందని, దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు తాత్కాలికంగా ఆసరా పథకాన్ని నిలిపివేసినట్టు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. 
 
కొవిడ్ నుంచి కోలుకున్న అనంతరం రెండు వారాలపాటు ఇంట్లోనే ఉండి బలవర్థకమైన ఆహారం తీసుకునే ఉద్దేశంతో ఏప్రిల్ నెలాఖరులో ప్రభుత్వం ప్రతి ఒక్కరికి రూ.2 వేల ఆర్థికసాయాన్ని ప్రకటించింది. ఇందుకోసం మే 4వ తేదీ వైద్య ఆరోగ్య శాఖకు రూ.10 కోట్లు మంజూరు చేసింది. ఆ వెంటనే బాధితులకు చెల్లింపుల కూడా చేశారు. అలా మొత్తం రూ.20 కోట్లు చెల్లించారు.
 
అయితే, జులై నుంచి మాత్రం ఈ చెల్లింపులు నిలిపివేశారు. మరోవైపు క్వారంటైన్ కేంద్రాలు తగ్గి కోవిడ్ సంరక్షణ కేంద్రాలు పెరిగాయి. హోం క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నవారు పెరిగారు. దీంతో ఆసరా ఆర్థిక సాయాన్ని నిలిపివేసినట్టు తెలుస్తోంది. 
 
ప్రభుత్వ ఆదేశాలతో గత నాలుగు రోజులుగా ఆసరా చెల్లింపులు చేయడం లేదని అనంతపురం జిల్లా కలెక్టర్ చెప్పినట్టు జిల్లా సమాచారశాఖ అధికారులు తెలిపారు. అదేవిధంగా కోవిడ్ వైరస్ కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు కూడా రూ.15 వేల ఆర్థికసాయాన్ని చాలా చోట్ల అందించడం లేదని సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments