Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ అక్రమాస్తుల కేసు : హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు ఏ-1, ఏ-2

Webdunia
శుక్రవారం, 10 జనవరి 2020 (11:06 IST)
వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో సాగుతోంది. ఈ కేసు విచారణలో భాగంగా, ముఖ్యమంత్రి హాదాలో వైకాపా అధినేత జగన్ తొలిసారి శుక్రవారం కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో ఆయన ఏ-1 నిందితుడుగా ఉన్న విషయం తెల్సిందే. దీంతో కేసు విచారణకు ఆయన హాజరయ్యారు. 
 
ఇందుకోసం విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి శుక్రవారం ఉదయం హైదరాబాద్ బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో నేరుగా కోర్టుకు వెళ్లారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ-2గా ఉన్న వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డితో పాటు.. మాజీ మంత్రి, వైకాపా ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద రావు కూడా కోర్టుకు వచ్చారు. 
 
నిజానికి ఈ కేసు విచారణలో భాగంగా, జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావాల్సివుంది. అయితే, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాలనాపరమైన కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందువల్ల వ్యక్తిగత హాజరు నుంచి కొంతకాలం జగన్‌కు మినహాయింపు ఇచ్చింది. అయితే, జనవరి పదో తేదీన జరిగే విచారణకు మాత్రం తప్పకుండా హాజరుకావాల్సిందేనంటూ ఆదేశించింది. దీంతో జగన్మోహన్ రెడ్డి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కోర్టుకు హాజరైబోనులో నిల్చున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

తర్వాతి కథనం
Show comments