Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా ఉద్యోగులకు అదనంగా ఐదు రోజులు సెలవులు

Webdunia
బుధవారం, 10 మార్చి 2021 (22:17 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మహిళా దినోత్సవం నాడు ఇచ్చిన హామీని రెండు రోజుల్లోనే నిలబెట్టుకున్నారు. మహిళా ఉద్యోగులకు అదనంగా ఐదు రోజులు సెలవులు ఇవ్వాలని మహిళా దినోత్సవం రోజు వైఎస్ జగన్ నిర్ణయించగా.. ప్రత్యేక సీఎల్ లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 
 
ప్రస్తుతం ఉన్న 15 రోజుల సెలవులకు అదనంగా ఐదు సెలవులు మంజూరు చేసింది. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు ఈ వెసులుబాటు కల్పించినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ సెలవులు మహిళా టీచర్లు, లెక్చరర్లకు కూడా వర్తిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. 
 
ఈ మేరకు జీవో నెం.18ని విడుదల చేసింది. మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు మంజూరు చేయడంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఇందుకుగానూ సీఎం వైఎస్ జగన్ కు ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ కృతజ్ఞతలు తెలిపాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments