Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా ఉద్యోగులకు అదనంగా ఐదు రోజులు సెలవులు

Webdunia
బుధవారం, 10 మార్చి 2021 (22:17 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మహిళా దినోత్సవం నాడు ఇచ్చిన హామీని రెండు రోజుల్లోనే నిలబెట్టుకున్నారు. మహిళా ఉద్యోగులకు అదనంగా ఐదు రోజులు సెలవులు ఇవ్వాలని మహిళా దినోత్సవం రోజు వైఎస్ జగన్ నిర్ణయించగా.. ప్రత్యేక సీఎల్ లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 
 
ప్రస్తుతం ఉన్న 15 రోజుల సెలవులకు అదనంగా ఐదు సెలవులు మంజూరు చేసింది. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు ఈ వెసులుబాటు కల్పించినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ సెలవులు మహిళా టీచర్లు, లెక్చరర్లకు కూడా వర్తిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. 
 
ఈ మేరకు జీవో నెం.18ని విడుదల చేసింది. మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు మంజూరు చేయడంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఇందుకుగానూ సీఎం వైఎస్ జగన్ కు ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ కృతజ్ఞతలు తెలిపాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments