Webdunia - Bharat's app for daily news and videos

Install App

17న ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు.. ప్రధాని మోడీతో భేటీనా?

ఈనెల 17వ తేదీన ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హస్తినకు వెళ్లనున్నారు. ఆ రోజున జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఆర్థిక మంత్రి అరుణ్

Webdunia
శుక్రవారం, 8 జూన్ 2018 (11:46 IST)
ఈనెల 17వ తేదీన ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హస్తినకు వెళ్లనున్నారు. ఆ రోజున జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా వారిద్దరితో చంద్రబాబు సమావేశం అవుతారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
 
మరోవైపు, నీతి ఆయోగ్ సమావేశంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం, ప్రత్యేక హోదా, కేంద్రం తీరుపై సీఎంల సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించనున్నట్టు తెలుస్తోంది. పోలవరం, రాజధాని నిర్మాణం వంటి అంశాల్లో కేంద్రం తీరు వల్ల తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఇందులో ప్రస్తావించాలని చంద్రబాబు భావిస్తున్నారు.
 
సమైఖ్య స్ఫూర్తికి విరుద్దంగా కేంద్రం వ్యవహరిస్తోందన్న అంశంపై ప్రత్యేక ఫోకస్ పెట్టనున్నారు. 15వ ఆర్థిక సంఘం విధి విధానాలపై గట్టిగా అభ్యంతరం తెలపాలని ఈ నెల 17వ తేదీన జరిగే ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై సీఎంఓ ఆఫీసు కసరత్తు ప్రారంభించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments