Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు కింద పడి ముగ్గురి ఆత్మహత్య

Webdunia
ఆదివారం, 1 డిశెంబరు 2019 (12:10 IST)
కేంద్రంలోని జాతీయ ఉద్యానవనం సమీపంలో ఓ మహిళ తన ఇద్దరు కుమార్తెలతో సహా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. మూడో పట్టణ సీఐ రెడ్డప్ప, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాపంపేట(జాకీర్‌ కొట్టాలు) ప్రాంతానికి చెందిన వెంకటేశు, పోలేరమ్మ(45) భార్యాభర్తలు. వీరు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 
 
వీరికి ఆర్తి(17), దీప(11) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె ఆర్తి ఇంటర్మీడియట్‌ పూర్తి చేసి, నర్సింగ్‌లో శిక్షణ పొందుతోంది. కొన్ని ఆర్థిక కారణంగా పోలేరమ్మ తన ఆభరణాలను తాకట్టు పెట్టింది. ఈ ఆభరణాల విషయమై ఇద్దరూ గొడవ పడ్డారు. ఈ క్రమంలో శనివారం రాత్రి 9 గంటల సమయంలో పోలేరమ్మ భర్తతో గొడవ పడి కుమార్తెలను తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. 
 
ఆందోళన చెందిన కుటుంబసభ్యులు వారి కోసం గాలింపు చేపట్టినా ఆచూకీ లభ్యం కాలేదు. ఆదివారం తెల్లవారుజామున రైలు పట్టాలపై వారు విగతజీవులుగా కనిపించారు. రైలు పట్టాలపై మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments