Webdunia - Bharat's app for daily news and videos

Install App

మానవ మృగంలా శవాలు పీక్కుతినే రాబందులా మారిన జగన్.. పిచ్చెక్కింది: ఆనం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నేత ఆనం వివేకానంద రెడ్డి ఫైర్ అయ్యారు. జగన్‌కు పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తూ పదే పదే ప్రభుత్వ పాలనను విమర్శిస్తున్నారని ఆనం మండిప

Webdunia
సోమవారం, 5 సెప్టెంబరు 2016 (11:00 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నేత ఆనం వివేకానంద రెడ్డి ఫైర్ అయ్యారు. జగన్‌కు పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తూ పదే పదే ప్రభుత్వ పాలనను విమర్శిస్తున్నారని ఆనం మండిపడ్డారు. ఆదివారం ఆనం మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ సమాధి అయిపోయే పరిస్థితిలో జగన్ అంతిమ పోరాటం చేస్తున్నారన్నారు.

రాయలసీమ రైతులను ఆదుకునేందుకు సీఎం శ్రమిస్తుంటే చూసి ఓర్వలేని జగన్ ధర్నాలు, బంద్‌లు అంటూ పిలుపునివ్వడం సిగ్గు చేటన్నారు. మానవ మృగంలా శవాలు పీక్కుతినే రాబందులా జగన్ తయారయ్యాడని విమర్శించారు.
 
అవినీతి ఊబిలో చిక్కుకుపోయిన జగన్ నారా లోకేశ్‌ను విమర్శించడం ఏమిటని ప్రశ్నించారు. పద్ధతి మార్చుకుని రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని హితవు పలికారు. నదిలో కొట్టుకుపోతున్న నావను నావికుడు ఏ విధంగా రక్షిస్తాడో ఆ తరహాలోనే చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రగతి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారన్నారు. రేపటి తరం కోసం ఆయన చేస్తున్న పోరాటానికి అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర రిలీజ్ వాయిదాకు కారణం?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

టీలు, కాఫీలకు బదులు ఈ జావ తాగరాదూ?

86 ఏళ్ల వృద్ధుడిలో మింగే రుగ్మతను విజయవంతంగా పరిష్కరించిన విజయవాడ మణిపాల్ హాస్పిటల్

తర్వాతి కథనం
Show comments