Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రంలో నక్సలిజం - టెర్రరిజం తగ్గింది.. లోకల్ మాఫియా పెరిగింది...

Webdunia
బుధవారం, 29 డిశెంబరు 2021 (17:40 IST)
ఏపీలో అధికార వైకాపాకు చెందిన ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన బుధవారం నెల్లూరులో మాట్లాడుతూ, రాష్ట్రంలో నక్సలిజం, టెర్రరిజం తగ్గిందన్నారు. కానీ, లోకల్ మాఫియా పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఈ లోకల్ మాఫియాలో పోలీసోళ్లు కూడా భాగస్వామ్యులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల్లో పోలీసులపై ఒక న్యాయం చేస్తారన్న నమ్మకం, భరోసా ఉంది. పోలీసులే మాఫియాతో చేతులు కలిపితే ఇక సామాన్యులకు ఎలాంటి న్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
 
కాగా, గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా, టీడీపీ ప్రభుత్వంలో కూడా ఆయన కీలకంగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన వైకాపా తరపున ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయన ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికీ తెలియదు. కానీ, అపుడపుడూ సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా అలాంటి వ్యాఖ్యలు చేసి వార్తలకెక్కారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments