Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యేక హోదా ఇవ్వక పోతే ప్రజలు కొట్టేలా ఉన్నారు : అనకాపల్లి ఎంపీ

Webdunia
సోమవారం, 2 మే 2016 (16:42 IST)
విభజన చట్టం మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే సీమాంధ్ర ప్రజల నుంచి తాము తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని టీడీపీకి చెందిన అనకాపల్లి ఎంపి అవంతి శ్రీనివాస్ అన్నారు. అందువల్ల విభజన చట్టం మేరకు గత యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తమకు ప్రత్యేక హోదాను ఎన్డీఏ ప్రభుత్వం ఇవ్వాలని ఆయన కోరారు. 
 
సోమవారం లోక్‌సభ శూన్య గంట సమయంలో ఆయన ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తారు. రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌ అన్ని విధాలా నష్టపోయిందని, ఆ లోటును పూడ్చాలని కోరారు. ప్రత్యేక హోదా ఇవ్వక పోవడంవల్ల ఏపీ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారంటూ ఆయన సభ దృష్టికి తీసుకొచ్చారు. 
 
విభజన కారణంగా ఐటీ, మౌలిక సదుపాయాలు, విద్యా సంస్థలు, ఇతర కంపెనీలన్నీ తెలంగాణాకు వెళ్ళిపోయాయన్నారు. వీటిని ఏపీలో మొదటి నుంచి ప్రారంభించాల్సి ఉందన్నారు. అదేసమయంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తమ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణాన్ని చేపట్టారని గుర్తు చేశారు. నిధుల సమస్యతో కొట్టుమిట్టాడుతున్న ఏపీలో అన్ని సవ్యంగా సాగాలంటే ప్రత్యేక ఇవ్వాల్సిందేనన్నారు. 
 
ఎఫ్డీఐలను ఆహ్వానిస్తున్నామని, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే అన్నీ సవ్యంగా సాగుతాయని అవంతి సభకు తెలిపారు. అందుకే ప్రత్యేక హోదా ఇవ్వాలని, దీని ప్రత్యేక కేసుగా పరిగణించాలని ఆయన కోరారు. 

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments