Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్ర‌బాబు లాంటి మ‌నిషిని క్ష‌మించ‌కూడ‌దు... జ‌గ‌న్ మోహన్ రెడ్డి(vedio)

గుంటూరు : ఏపీలో తీవ్ర‌మైన క‌ర‌వుతో ప‌శువులు కూడా చ‌నిపోతుంటే... చంద్ర‌బాబు ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేస్తూ రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకొంటున్నార‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ ధ్వ‌జ‌మెత్తారు. ఆయ‌నకు తెలిసింది మోసం, వెన్నుపోట్లు, ద‌గా మాత్ర‌మేన‌ని, చంద్ర‌బాబు లాంటి

Webdunia
సోమవారం, 2 మే 2016 (16:39 IST)
గుంటూరు : ఏపీలో తీవ్ర‌మైన క‌ర‌వుతో ప‌శువులు కూడా చ‌నిపోతుంటే... చంద్ర‌బాబు ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేస్తూ రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకొంటున్నార‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ ధ్వ‌జ‌మెత్తారు. ఆయ‌నకు తెలిసింది మోసం, వెన్నుపోట్లు, ద‌గా మాత్ర‌మేన‌ని, చంద్ర‌బాబు లాంటి మ‌నిషిని క్ష‌మించ‌కూడ‌ద‌ని చెప్పారు. 
 
రాష్ట్రంలో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొని ఉన్నప్పటికీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్న సర్కార్ వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపట్టింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం గుంటూరు జిల్లా మాచర్ల తహశీల్దారు కార్యాలయం వద్ద ధర్నాలో పాల్గొన్నారు. 
 
అంతకుముందు ఆయన వాహనంపై నుంచి ఖాళీ బిందెతో నిరసన తెలియచేస్తూ మున్సిపల్ కార్యాలయం నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకూ ర్యాలీగా వచ్చారు. ఎండ తీవ్రంగా ఉన్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ ధర్నాలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. హైదరాబాద్ నుంచి బయల్దేరిన జ‌గ‌న్ మోహన్ రెడ్డికి నాగార్జున సాగర్ వద్ద పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. వీడియో చూడండి.
 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం