Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరులో పోలీసుకు పవర్ తుస్... వృద్ధుడు కూడా బాదేస్తాడంతే... (Video)

Webdunia
మంగళవారం, 22 జనవరి 2019 (18:18 IST)
ఏపీలో పోలీసులకే రక్షణ లేకుండాపోయింది. సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో టీడీపీ తమ్ముళ్లకు పోలీసులన్నా లెక్కలేకుండాపోయింది. జిల్లా టీడీపీ ఆఫీస్‌లో ఆపరేటర్‌గా పనిచేసే యుగంధర్‌ నాయుడు తండ్రి చంద్రశేఖర్ నాయుడు ఏకంగా నడిరోడ్డుపైనే కానిస్టేబుళ్లు కర్ర తీసుకుని చితకబాదాడు. పోలీసులైతే ఏం పీకుతార్రా... అంటూ కర్ర తీసుకుని పదేపదే కొట్టాడు. దీంతో కానిస్టేబుల్‌ తలకు గాయమైంది. 
 
ఈ దృశ్యాలను కొందరు మొబైల్‌లో చిత్రీకరించడంతో సంచలనంగా మారింది. జిల్లాలోని పెనుమూరు మండల కేంద్రంలో ఒక స్థల వివాదం కోర్టుకు చేరింది. ఆ స్థలంలో ఎవరూ పనులు చేపట్టవద్దని కోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. అయితే చంద్రశేఖర్‌ నాయుడు జేసీబీ సాయంతో స్థలంలో పనులు చేపట్టారు. 
 
ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎస్‌ఐ… పనులను అడ్డుకునేందుకు కానిస్టేబుల్‌ రమేష్‌ను పంపించాడు. అక్కడికి వెళ్లిన రమేష్ కోర్టు ఆదేశాలను చూపించి ఇక్కడ పనులు చేయడం నేరమని చెప్పే ప్రయత్నం చేశాడు. దీంతో చంద్రశేఖర్‌ నాయుడికి కోపం వచ్చింది. నీవు ఎవడ్రా నాకు చెప్పడానికి అంటూ కర్ర తీసుకుని మహిళల సమక్షంలోనే కానిస్టేబుల్‌ను చితకబాదాడు. చూడండి వీడియో... 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaa: నాగసాధువు తమన్నా ప్రమోషన్ కోసం హైదరాబాద్ విచ్చేసింది

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments