Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరులో పోలీసుకు పవర్ తుస్... వృద్ధుడు కూడా బాదేస్తాడంతే... (Video)

Webdunia
మంగళవారం, 22 జనవరి 2019 (18:18 IST)
ఏపీలో పోలీసులకే రక్షణ లేకుండాపోయింది. సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో టీడీపీ తమ్ముళ్లకు పోలీసులన్నా లెక్కలేకుండాపోయింది. జిల్లా టీడీపీ ఆఫీస్‌లో ఆపరేటర్‌గా పనిచేసే యుగంధర్‌ నాయుడు తండ్రి చంద్రశేఖర్ నాయుడు ఏకంగా నడిరోడ్డుపైనే కానిస్టేబుళ్లు కర్ర తీసుకుని చితకబాదాడు. పోలీసులైతే ఏం పీకుతార్రా... అంటూ కర్ర తీసుకుని పదేపదే కొట్టాడు. దీంతో కానిస్టేబుల్‌ తలకు గాయమైంది. 
 
ఈ దృశ్యాలను కొందరు మొబైల్‌లో చిత్రీకరించడంతో సంచలనంగా మారింది. జిల్లాలోని పెనుమూరు మండల కేంద్రంలో ఒక స్థల వివాదం కోర్టుకు చేరింది. ఆ స్థలంలో ఎవరూ పనులు చేపట్టవద్దని కోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. అయితే చంద్రశేఖర్‌ నాయుడు జేసీబీ సాయంతో స్థలంలో పనులు చేపట్టారు. 
 
ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎస్‌ఐ… పనులను అడ్డుకునేందుకు కానిస్టేబుల్‌ రమేష్‌ను పంపించాడు. అక్కడికి వెళ్లిన రమేష్ కోర్టు ఆదేశాలను చూపించి ఇక్కడ పనులు చేయడం నేరమని చెప్పే ప్రయత్నం చేశాడు. దీంతో చంద్రశేఖర్‌ నాయుడికి కోపం వచ్చింది. నీవు ఎవడ్రా నాకు చెప్పడానికి అంటూ కర్ర తీసుకుని మహిళల సమక్షంలోనే కానిస్టేబుల్‌ను చితకబాదాడు. చూడండి వీడియో... 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments