Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జేబులో చౌక ఫోన్.. పేలిపోయింది.. వృద్ధుడు సజీవదహనం..

Advertiesment
Old man
స్మార్ట్‌ఫోన్ల యుగం నడుస్తోంది. చేతిలో స్మార్ట్‌ఫోన్ లేనిదే కాలం నడపదనేవారు చాలామందే వున్నారు. అయితే స్మార్ట్ ఫోన్ల వినియోగంతో ఎంత ప్రమాదమో చాలామంది గ్రహించట్లేదు. అందుకు ఈ ఘటనే నిదర్శనం. రాజస్థాన్ సర్కారు అందించిన చౌక ఫోన్ ఓ వ్యక్తి ప్రాణాలనే బలిగొంది. రాజస్థాన్ సర్కారు అందజేసిన ఫోన్‌ను జేబులో పెట్టుకున్న పాపానికి ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. 
 
జేబులో పెట్టుకున్న ఫోన్ పేలడంతో ఆ వృద్ధుడు సజీవదహనం అయ్యాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని నెతావల్ గఢ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, రాజస్థాన్‌లోని పాచ్లీ గ్రామంలో ఓ వృద్ధుడు ఇటీవల రాజస్థాన్ సర్కారు రూ.1100కు అందజేసిన ఫోనును కొనుగోలు చేశాడు. ఈ ఫోన్‌ను రాత్రి నిద్రించేటప్పుడు కూడా జేబులో పెట్టుకున్నాడు. 
 
అంతే శుక్రవారం రాత్రి ఒక్కసారిగా జేబులో వున్న ఫోన్ పేలిపోయింది. దీంతో మంటలు వ్యాపించాయి. ఈ మంటల్లో చిక్కుకుని నిద్రిస్తున్న వృద్ధుడు సజీవదహనం అయ్యాడు, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఫోనులోని ఛార్జర్ వేడి కావడంతోనే అది పేలిపోయిందని.. మంటలు దుస్తులకు బాగా అంటుకుపోవడంతో నిద్రలో వున్న వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు చెప్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భక్తికి, ప్రశాంతతకు ఆనవాలుగా నిలవాల్సిన ఆలయం మృత్యుకూపం