Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ క్షణమైనా లగడపాటి అరెస్ట్.. ఎందుకంటే..?

Webdunia
మంగళవారం, 28 మే 2019 (17:49 IST)
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌పై పోలీస్ కేసు నమోదైంది. ఏపీ ఎన్నికలపై లగడపాటి సర్వేపై కొవ్వూరుకు చెందిన అడ్వకేట్ మురళీకృష్ణ ఫిర్యాదు చేశారు. లగడపాటి కారణంగా చాలామంది నష్టపోయారని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని సర్వే చేసి చెప్పిన లగడపాటి వలన అనేకమంది బెట్టింగులు కట్టి నష్టపోయారన్నారు. 
 
ఈ తప్పుడు సర్వేల వెనుక ఎవరు ఉన్నారో విచారణ జరిపి తేల్చాలని పోలీసులను కోరారు. కాగా, ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. లగడపాటి వెనుక అంతర్జాతీయ బెట్టింగ్ మాఫియా అండదండలున్నాయని అనుమానం వ్యక్తం చేశారు అడ్వకేట్ మురళీ కృష్ణ.
 
ఏపీ ఎన్నికల ఫలితాలకు ముందు లగడపాటి ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలను ప్రకటించారు. టీడీపీయే అధికారం చేపడుతుందంటూ... ఆయన జోస్యం చెప్పారు. అయితే ఫలితాల్లో టీడీపీ అడ్రేస్ లేకుండా పోయింది. లగడపాటి సర్వే శుద్ధ తప్పని తేలింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనంలా దూసుకొచ్చింది. దీంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బోల్తా కొట్టిన లగడపాటి... ఏపీ ఎన్నికల్లో కూడా మరోసారి బోర్లా పడ్డారు. 
 
దీంతో ఇప్పుడు ఆయన చిక్కుల్లో పడ్డారు. లగడపాటిని నమ్మి కోట్ల రూపాయలు బెట్టింగులు కట్టినవారంతో తీవ్రంగా నష్టపోయారంటూ లాయర్ మురళీ కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తప్పుడు సర్వేలతో జనాన్ని మోసం చేస్తున్న లగడపాటిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments