Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీశైలం మల్లన్న సేవలో హోం మంత్రి అమిత్ షా

Webdunia
గురువారం, 12 ఆగస్టు 2021 (14:53 IST)
కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన కుటుంబ సభ్యులతో కలిసి గురువారం శ్రీశైలం మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్నారు. శ్రీశైలానికి తొలిసారి వచ్చిన ఆయనకు ఆలయం వద్ద పూర్ణ కుంభంతో వేద పండితులు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని ఆయన దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. 
 
ఇందుకోసం ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌కు కుటుంబసభ్యులతో కలిసి వచ్చారు. అక్కడ నుంచి హెలికాప్టర్‌లో శ్రీశైలం చేరుకున్నారు. హోం మంత్రికి స్వాగతం పలికినవారిలో ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ వాని మోహన్, బీజేపీ నేతలు ఆదినారాయణ రెడ్డి, అంబాల ప్రభాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు 
 
కేంద్ర హోంమంత్రి పర్యటన నేపథ్యంలో ఆలయ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు.. నల్లమల ఫారెస్ట్‌ మీదుగా ఆయన ప్రయాణం సాగడంతో.. ఇరు రాష్ట్రాల పోలీసులు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments