Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బో.. సీఎం జగన్ పాలన గురించి ఏం చెప్తిరి.. ఏం చెప్తిరి... మంత్రి అమిత్ షాపై సెటైర్లు

Webdunia
ఆదివారం, 11 జూన్ 2023 (22:08 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పాలనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శలు గుప్పించడంపై ప్రతి ఒక్కరూ ఔరా అంటూ నోటిపై వేలేసుకుంటున్నారు. ఏపీలోని జగన్ పాలన అంతా అవినీతిమయం అంటూ ఆదివారం సాయంత్రం వైజాగ్ వేదికగా జరిగిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్న హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించడం ప్రతి ఒక్కరినీ విస్మయానికి గురిచేసింది. 
 
గత నాలుగేళ్లుగా సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అన్ని అరాచకాలకు, అడ్డుగోలు పనులకు, రాష్ట్ర విధ్వంసానికి, అనైతిక చర్యలకు, బ్రిటిష్ కాలం నాటి చట్టాల అమలకు, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులోని నిందితులను రక్షించేందుకు, అడ్డుగోలు అప్పులకు ఇలా ఏ విధంగా సాయం చేయగలమో అన్నీ ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం చేసిందనే విమర్శలు లేకపోలేదు. ఒక్క విధంగా చెప్పాలంటే సీఎం జగన్‌కు ప్రధాని నరేంద్ర మోడీ, హోం అమిత్ షాలు కుడిఎడమ భుజాలుగా వ్యవహరించారని ఏపీ ప్రజల మనసుల్లోని మాట. వివేకా హత్య కేసును విచారిస్తున్న సీబీఐను తమ గుప్పెట్లో పెట్టుకుని ఆడిస్తున్నారనీ, ఈ కేసులో ఏ8 నిందితుడు కడప వైకాపా సిట్టింగ్ ఎంపీ అవినాశ్ రెడ్డిని అరెస్టు కాకుండా కేంద్రంలోని ఓ అదృశ్య శక్తి రక్షిస్తూ వస్తుందన్నది ప్రజలు చర్చించుకుంటున్న బహిరంగ రహస్యం. 
 
ఈ నేపథ్యంలో ఆదివారం విశాఖకు వచ్చిన అమిత్ షా... సీఎం జగన్ నాలుగేళ్ల పాలన అంతా అవినీతిమయం అంటూ వ్యాఖ్యానించడం ఆయన ఊసరవెల్లితనానికి నిదర్శనంగా చెప్తున్నారు. ఈ సభలో అమిత్ షా ప్రసంగిస్తూ, రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో ఉందన్నారు. అన్నదాతల ఆత్మహత్యలు ఆపని జగన్ సిగ్గుపడాలన్నారు. కేంద్రం ఇస్తున్న ఇళ్లకు జగన్ పేరు పెట్టుకున్నారని దుయ్యబట్టారు. ప్రధాని మోడీ ఇస్తున్న ఉచిత బియ్యం పథకానికి జగన్ ఫోటోనా అని ప్రశ్నించారు. వైకాపా వచ్చాక విశాఖ నగరం అరాచకాలకు అడ్డాగా మారిపోయిందని దుయ్యబట్టారు. 
 
గత తొమ్మిదేళ్ల కాలంలో ఏపీ అభివృద్ధికి రూ.5 లక్షల కోట్లు ఇచ్చామన్నారు. మైనింగ్, మాఫియా, గుంజాయికి అడ్డాగా ఏపీ మారిందన్నారు. అమరావతి, విశాఖ, కాకినాడ, తిరుపతి స్మార్ట్ సిటీలు చేస్తున్నామన్నారు. గత నాలుగేళ్లుగా సీఎం జగన్‌కు కేంద్ర హోం మంత్రిగా, బీజేపీలో కీలక నేతగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్న అమిత్ షా.. విశాఖ వేదికగా జగన్‌పై దుమ్మెత్తి చేయడం వింతగానూ, విచిత్రంగా ఉందని విపక్ష నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదైనా ఈ రాజకీయ నేతలకే చెల్లుబాటు అవుతుందని ఏపీ ప్రజలు అనుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

35వ వార్షికోత్సవంలో అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ ల శివ

జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యం తో తీశా : ఖడ్గం రీ రిలీజ్ సందర్భంగా కృష్ణవంశీ

రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్.

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి.. గుండెపోటుతో 38 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు...

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments