Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు నివాసం కూల్చివేత ఖాయమా? పెంకుటిల్లులోకి టీడీపీ చీఫ్!

Webdunia
గురువారం, 27 జూన్ 2019 (14:07 IST)
కృష్ణా నది కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాలను కూల్చివేయాలని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులోభాగంగా, కరకట్టపై నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రజా వేదిక భవనాన్ని రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. 
 
ఈ ప్రజావేదిక పక్కనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసం కూడా ఉంది. దీంతో ఈ ఇంటిని కూడా రెవెన్యూ అధికారులు కూల్చివేసేందుకు నోటీసులు ఇవ్వొచ్చనే ఊహాగానాలు వస్తున్నాయి. ఇప్పటికే కరకట్టపై ఉన్న దాదాపు 60 అక్రమ నిర్మాణాల యజమానులకు నోటీసులు కూడా జారీ చేశారు. 
 
ఈ నేపథ్యంలో చంద్రబాబు తాను నివసిస్తున్న ఇంటిని ఖాళీ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఇప్పటికే రంగంలోకి దిగిన తెలుగుదేశం నేతలు, చంద్రబాబు అవసరాలకు తగ్గ ఇంటిని వెతికే పనిలో బిజీగా మారిపోయారు. చివరికి వెలగపూడిలో 90 ఏళ్ల పాతదైన ఇంటిని టీడీపీ నేతలు ఎంపిక చేశారు. 
 
ఈ పెంకుటిల్లును చంద్రబాబుకు ఇచ్చేందుకు వెలగపూడి మాజీ సర్పంచ్ శాంతమ్మ సంతోషంగా అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఈ ఇంటిని టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు పరిశీలించారు. మండువా లోగిలి, పచ్చటి చెట్లతో ఈ ఇల్లు బాగుందని ఆయన కితాబిచ్చారు. అయితే ఈ ఇంటిలోకి చంద్రబాబు ఎప్పుడు మారతారు? ఉండవల్లిలోని లింగమనేని గెస్ట్ హౌస్‌ను ఖాళీ చేస్తారా? అన్న విషయమై క్లారిటీ రావాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments