Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఆస్తి పన్ను చట్టానికి సవరణ

Webdunia
బుధవారం, 25 నవంబరు 2020 (05:29 IST)
ఏపీలో ఆస్తి పన్ను చట్టానికి సవరణ చేశారు. 2021-22 నుంచి రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా ఆస్తి పన్ను లెక్కించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పురపాలక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.

ప్రభుత్వం ఇప్పటివరకు ఏడాది అద్దె ప్రాతిపదికన ఆస్తి పన్నును లెక్కిస్తోంది. ఇకపై రిజిస్ట్రేషన్ విలువ సవరించిన ప్రతిసారి ఆ మేరకు ఆస్తి పన్ను పెరగనుంది. రిజిస్ట్రేషన్ విలువ ఆధారిత పన్ను 10 శాతం కంటే ఎక్కువ ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది.
 
కాగా, కొత్తగా సవరించిన మేరకు ధార్మిక, విద్య, వైద్య, సాంస్కృతిక కట్టడాలకు ఆస్తి పన్ను మినహాయించారు. సైనికులు, మాజీ సైనికుల గృహాలకు కూడా ఆస్తి పన్ను నుంచి వెసులుబాటు కల్పించారు.

375 చదరపు అడుగుల లోపు భవనాలకు వార్షిక ఆస్తిపన్ను రూ.50గా నిర్ధారించారు. అంతేకాదు, భవన నిర్మాణ శైలి ఆధారంగా ఆస్తి విలువ ఖరారు చేయనున్నారు.
 
ఆర్ సీసీ, రేకులు, పెంకులు, నాపరాళ్లు, పూరిళ్లకు వర్గీకరణ ఆధారంగా ఆస్తి పన్ను నిర్ణయించనున్నారు. ఆస్తి పన్ను నిర్ధారించే క్రమంలో అక్రమ కట్టడాలకు 25 నుంచి 100 శాతం జరిమానా విధించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments