Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. రూ.40లక్షల పొగాకు దగ్ధం.. ఎలా?

Webdunia
మంగళవారం, 14 మార్చి 2023 (11:12 IST)
రోగిని తీసుకెళ్తున్న అంబులెన్స్‌లో మంటలు చెలరేగడంతో ఒక వ్యక్తి గాయపడి రూ.40 లక్షల విలువైన పొగాకు దగ్ధమైంది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో సోమవారం అర్థరాత్రి చోటుచేసుకుంది.
 
108 అంబులెన్స్‌లో డయాలసిస్‌ కోసం ఒక రోగిని రాజాసాహెబ్‌పేట గ్రామం నుంచి ఆసుపత్రికి తీసుకువెళుతున్నారు. కొంత దూరం వెళ్లగానే డ్రైవర్ తిరుపతిరావు క్యాబిన్‌లో పొగలు రావడం గమనించాడు. వెంటనే అంబులెన్స్‌ను ఆపి సహచరుడు మధుసూధన్‌రెడ్డిని అప్రమత్తం చేశాడు. తరువాతి రోగికి, అతనితో పాటు ఉన్న అతని తల్లికి బండి నుంచి దించేందుకు సాయపడ్డాడు. 
 
షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా చెలరేగిన మంటలు కొద్దిసేపటికే వాహనం మొత్తం వ్యాపించాయి. అంబులెన్స్‌లో ఉంచిన ఆక్సిజన్ సిలిండర్ పేలింది. ఈ వాహనం నుంచి వెలువడిన మంటలు సమీపంలోని రైతులు పొగాకు నిల్వ చేసిన షెడ్‌పై పడింది. దీంతో ఆ షెడ్‌లోని మొత్తం పొగాకు స్టాక్ బూడిదగా మారింది. దీంతో రూ.40 లక్షల నష్టం వాటిల్లిందని షెడ్డులో పొగాకు నిల్వ ఉంచిన ముగ్గురు రైతులు తెలిపారు.
 
షెడ్డు దగ్గర నిలబడిన వ్యక్తికి కూడా ఈ ఘటనతో గాయాలైనాయి. అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఆ ప్రాంత ప్రజలను భయాందోళనకు గురి చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments