Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవిందా..గోవిందా, అద్భుతం.. శేషాచలం కొండల్లో...

Webdunia
శుక్రవారం, 24 జులై 2020 (19:27 IST)
తిరుమల వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న ప్రాంతమంటేనే ఒక ప్రత్యేకత. ఏడుకొండపై ఉన్న స్వామివారిని దర్సించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు వచ్చి వెళుతుంటారు. అలాంటి ప్రాంతం ఇప్పుడు మరింత అందంగా.. అద్భుతంగా దర్సనమిస్తోంది.
 
గత వారంరోజుల నుంచి తిరుపతిలో వర్షం పడుతోంది. కాసేపు వర్షం పడినా శేషాచలం కొండలు మాత్రం పచ్చగా కనిపిస్తున్నాయి. ఎండాకాలంలో అటవీ ప్రాంతంలోనే చెట్లన్నీ ఎండిపోయి కళావిహీనంగా మారిపోతే ప్రస్తుతం వర్షం కారణంగా ఎంతో అందంగా శేషాచలం కొండలు కనిపిస్తున్నాయి.
 
దాంతో పాటు తిరుమలలో పడిన వర్షానికి కొండల మధ్య నుంచి నీరు జాలువారి తిరుపతిలోని కపిలతీర్థంలోకి వస్తోంది. మాల్వాడి గుండం నుంచి కపిలేశ్వర ఆలయంలోకి వస్తున్న నీటిని భక్తులు, స్థానికులు ఆహ్లాదకరంగా తిలకిస్తున్నారు. మరోవైపు తిరుమల ఘాట్ రోడ్లలో మంచు దుప్పట్లు కనిపిస్తున్నాయి. 
 
మంచు కొండలను దట్టంగా కప్పడంతో పాటు చిరుజల్లులు పడుతుండడంతో ఘాట్ రోడ్లలో వెళ్ళే భక్తులు కొత్త లోకంలో విహరిస్తున్నారు. ఎంతో అద్భుతమైన దృశ్యాలు శేషాచలం కొండల్లో కనిపిస్తుండడంతో భక్తుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. పరిమిత సంఖ్యలో భక్తులు వస్తున్నా తిరుపతిలోని వాతావరణానికి మంత్రముగ్థులు అవుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments