పంట పొలాల్లో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు... పవన్ పొలాల్లోకి రావాలంటున్న అమరావతి రైతులు
సినీ హీరో... జనసేన అధినేత పవన్ కల్యాణ్ పంట పొలాల్లోకి రావాలని ఏపీ రాజధాని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో కొందరు రైతులు రాజధాని భూ సేకరణను వ్యతిరేకిస్తున్నారు. గతంలో భూములు ఇవ్వకుండా వ్యతిరేకంగా ప
సినీ హీరో... జనసేన అధినేత పవన్ కల్యాణ్ పంట పొలాల్లోకి రావాలని ఏపీ రాజధాని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో కొందరు రైతులు రాజధాని భూ సేకరణను వ్యతిరేకిస్తున్నారు. గతంలో భూములు ఇవ్వకుండా వ్యతిరేకంగా పోరాడిన రైతులకు పవన్ కల్యాణ్ వచ్చి భరోసా ఇచ్చాడు. కానీ, మళ్లీ అయిపే లేడు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం వీరి భూములును భూసేకరణ చట్టం ఉపయోగించి లాక్కునే ప్రయత్నం చేస్తుండటంతో రైతులు భయభ్రాంతులవుతున్నారు.
గతంలో రైతుల భూసేకరణ విషయంలో అండగా ఉన్న "జనసేన" అధినేత పవన్ కళ్యాణ్ ఇపుడు మళ్శీ రావాలని మొరపెట్టుకుంటున్నారు. తమ పంట పొలాల్లో వవన్ కల్యాణ్ ప్లెక్సీలను ఏర్పాటు చేసి, వాల్ పోస్టర్లు ద్వారా పెనుమాక రైతులు పవన్ కళ్యాణ్కి తమ సాదకబాధకాలు వివరించారు. సంవత్సరానికి మూడు పంటలు పండే భూమిని రాజధాని ప్రాజెక్ట్ పేరిట ప్రభుత్వం లాక్కొంటే తాము సహించేది లేదని, ప్రాణాలు పోయినా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడతామని అంటున్నారు. తమకు ఈ కష్ట సమయంలో పవన్ కళ్యాణ్ అండగా ఉంటాడని పెనుమాక రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.