Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి రైలు మార్గ నిర్మాణానికి రైల్వే బోర్డు ఆమోదం

ఠాగూర్
శుక్రవారం, 16 ఆగస్టు 2024 (09:52 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతి రైలు మార్గం అనుసంధానం కోసం రూ.2,047 కోట్లతో 56 కిలోమీటర్ల రైల్వేలైనుకు సంబంధించిన డీపీఆర్ (సవివర ప్రాజెక్టు నివేదిక)కు రైల్వేబోర్డు అమోదం తెలిపిన తర్వాత నీతి ఆయోగ్ ఆమోదముద్ర వేసిందని మండల రైల్వే అధికారి(డీఆర్ఎం) రామకృష్ణ తెలిపారు. గుంటూరులోని రైలి విహార్ క్రీడా మైదానంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ గురువారం ఘనంగా జరిగాయి.
 
ఈ వేడుకల్లో భాగంగా, ముందుగా జాతీయ జెండాను ఎగురవేసి రైల్వే రక్షక దళం నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం రామకృష్ణ మాట్లాడారు. ఈ మార్గంలో కృష్ణానదిపై ఒక భారీ వంతెన కూడా నిర్మిస్తున్నామన్నారు. గుంటూరు - బీబీనగర్ రెండో లైను నిర్మాణానికి రూ.2,853 కోట్లు మంజూరయ్యాయన్నారు. ఇందులో 48 కి.మీ మార్గం నిర్మాణం పనులు వచ్చే నెలలో ప్రారంభమవుతాయన్నారు. 
 
గుంటూరు - గుంతకల్ మార్గంలో మొత్తం 400 కిలోమీటర్ల నిర్మాణంలో ఇంకా 100 కి.మీ మాత్రమే మిగిలిందన్నారు. నడికుడి - శ్రీకాళహస్తి మార్గంలో మొత్తం 308 కి.మీకి ఇప్పటివరకు 75 కి.మీ పూర్తయిందన్నారు. అమృత్ పథకం కింద 16 స్టేషన్ల అభివృద్ధికి రూ.300 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. గత ఏడాది డివిజన్ రూ.671 కోట్ల ఆదాయం ఆర్జించగా, ఈ యేడాది జులై వరకు రూ.208.713 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments